ఉపాధ్యాయ సమస్యలపై ఐక్యపోరాటం.....
ఉపాధ్యాయ సమస్యలపై ఐక్యపోరాటం.....
Harish HS
ఉపాధ్యాయ సమస్యలపై ఐక్యపోరాటం.....
5న ఢిల్లీలో ధర్నా కు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలిరావాలి....
ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సదానంద గౌడ్....
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అన్ని సంఘాలు ఏకమై ఉమ్మడి కార్యాచరణతో పోరాడాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) రాష్ట్ర అధ్యక్షులు సదానంద గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం కోదాడలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జరిగిన సూర్యాపేట జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వీస్ రూల్స్ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని, 398 టీచర్ల అప్రెంటిస్ పీరియడ్ ఇంక్రిమెంట్లను పదవీ విరమణ సమయానికైనా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పీఆర్సీ , హెల్త్ కార్డులు, డీఏ బకాయిలను విడుదల చేయాలని కోరారు.ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్తో ఫిబ్రవరి 5న దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బంధం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలూరి అంజయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వి. సత్యనారాయణ, మాజీ ఉపాధ్యక్షులు బొమ్మగాని నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షులు నందిపాటి సైదులు, మరియు వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు నరసింహారావు, భిక్షం, పాడె సురేష్, ఖాసిం, శ్రీనివాస్, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.......

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి