Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:54 AM

ఉపాధ్యాయ సమస్యలపై ఐక్యపోరాటం.....

ఉపాధ్యాయ సమస్యలపై ఐక్యపోరాటం.....

ఉపాధ్యాయ సమస్యలపై ఐక్యపోరాటం.....
February 01, 2026 06:29 PM 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఉపాధ్యాయ సమస్యలపై ఐక్యపోరాటం.....

5న ఢిల్లీలో ధర్నా కు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలిరావాలి....

ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సదానంద గౌడ్....

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అన్ని సంఘాలు ఏకమై ఉమ్మడి కార్యాచరణతో పోరాడాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) రాష్ట్ర అధ్యక్షులు సదానంద గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం కోదాడలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జరిగిన సూర్యాపేట జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వీస్ రూల్స్ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని, 398 టీచర్ల అప్రెంటిస్ పీరియడ్ ఇంక్రిమెంట్లను పదవీ విరమణ సమయానికైనా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పీఆర్సీ , హెల్త్ కార్డులు, డీఏ బకాయిలను విడుదల చేయాలని కోరారు.ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్‌తో ఫిబ్రవరి 5న దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బంధం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలూరి అంజయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వి. సత్యనారాయణ, మాజీ ఉపాధ్యక్షులు బొమ్మగాని నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షులు నందిపాటి సైదులు, మరియు వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు నరసింహారావు, భిక్షం, పాడె సురేష్, ఖాసిం, శ్రీనివాస్, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.......

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News