Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:12 PM

ఉపాధ్యాయ సమస్యలపై ఐక్యపోరాటం.....

ఉపాధ్యాయ సమస్యలపై ఐక్యపోరాటం.....

ఉపాధ్యాయ సమస్యలపై ఐక్యపోరాటం.....
February 01, 2026 06:29 PM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

ఉపాధ్యాయ సమస్యలపై ఐక్యపోరాటం.....

5న ఢిల్లీలో ధర్నా కు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలిరావాలి....

ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సదానంద గౌడ్....

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అన్ని సంఘాలు ఏకమై ఉమ్మడి కార్యాచరణతో పోరాడాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) రాష్ట్ర అధ్యక్షులు సదానంద గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం కోదాడలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జరిగిన సూర్యాపేట జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వీస్ రూల్స్ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని, 398 టీచర్ల అప్రెంటిస్ పీరియడ్ ఇంక్రిమెంట్లను పదవీ విరమణ సమయానికైనా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పీఆర్సీ , హెల్త్ కార్డులు, డీఏ బకాయిలను విడుదల చేయాలని కోరారు.ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్‌తో ఫిబ్రవరి 5న దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బంధం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలూరి అంజయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వి. సత్యనారాయణ, మాజీ ఉపాధ్యక్షులు బొమ్మగాని నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షులు నందిపాటి సైదులు, మరియు వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు నరసింహారావు, భిక్షం, పాడె సురేష్, ఖాసిం, శ్రీనివాస్, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.......

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News