Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:35 AM

ఉపాధ్యాయ సమస్యలపై ఐక్యపోరాటం.....

ఉపాధ్యాయ సమస్యలపై ఐక్యపోరాటం.....

ఉపాధ్యాయ సమస్యలపై ఐక్యపోరాటం.....
01-02-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

ఉపాధ్యాయ సమస్యలపై ఐక్యపోరాటం.....

5న ఢిల్లీలో ధర్నా కు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలిరావాలి....

ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సదానంద గౌడ్....

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అన్ని సంఘాలు ఏకమై ఉమ్మడి కార్యాచరణతో పోరాడాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) రాష్ట్ర అధ్యక్షులు సదానంద గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం కోదాడలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జరిగిన సూర్యాపేట జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వీస్ రూల్స్ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని, 398 టీచర్ల అప్రెంటిస్ పీరియడ్ ఇంక్రిమెంట్లను పదవీ విరమణ సమయానికైనా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పీఆర్సీ , హెల్త్ కార్డులు, డీఏ బకాయిలను విడుదల చేయాలని కోరారు.ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్‌తో ఫిబ్రవరి 5న దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బంధం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలూరి అంజయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వి. సత్యనారాయణ, మాజీ ఉపాధ్యక్షులు బొమ్మగాని నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షులు నందిపాటి సైదులు, మరియు వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు నరసింహారావు, భిక్షం, పాడె సురేష్, ఖాసిం, శ్రీనివాస్, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.......

Sthanikam

ఉపాధ్యాయ సమస్యలపై ఐక్యపోరాటం.....

Article Image

ఉపాధ్యాయ సమస్యలపై ఐక్యపోరాటం.....

5న ఢిల్లీలో ధర్నా కు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలిరావాలి....

ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సదానంద గౌడ్....

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అన్ని సంఘాలు ఏకమై ఉమ్మడి కార్యాచరణతో పోరాడాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) రాష్ట్ర అధ్యక్షులు సదానంద గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం కోదాడలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జరిగిన సూర్యాపేట జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వీస్ రూల్స్ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని, 398 టీచర్ల అప్రెంటిస్ పీరియడ్ ఇంక్రిమెంట్లను పదవీ విరమణ సమయానికైనా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పీఆర్సీ , హెల్త్ కార్డులు, డీఏ బకాయిలను విడుదల చేయాలని కోరారు.ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్‌తో ఫిబ్రవరి 5న దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బంధం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలూరి అంజయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వి. సత్యనారాయణ, మాజీ ఉపాధ్యక్షులు బొమ్మగాని నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షులు నందిపాటి సైదులు, మరియు వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు నరసింహారావు, భిక్షం, పాడె సురేష్, ఖాసిం, శ్రీనివాస్, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.......

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News