ఉపాధ్యాయులకు ఘన సన్మానం సర్పంచ్ విక్రమ్
ఉపాధ్యాయులకు ఘన సన్మానం సర్పంచ్ విక్రమ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి
ఇంద్రపాలనగరం
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మార్గదర్శక సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని ఇంద్రపాలనగరంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు, అణగారిన వర్గాల విద్యకు జీవితాంతం పోరాడిన ఆమె సేవలను స్మరించుకుంటూ గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ—భారతదేశంలో తొలి బాలికల పాఠశాలను ప్రారంభించి సమానత్వం, న్యాయం కోసం సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె జన్మదినాన్ని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం విద్యను విప్లవాత్మకంగా మార్చిన ఆమె అపార కృషికి గౌరవ సూచకమని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్లస్వామి జయసుధ, వార్డ్ మెంబర్లు, యువనాయకుడు సింగణబోయిన గణేష్, ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్ కొమ్మగోని మమత, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు, సీనియర్ నాయకులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి