Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:20 AM

ఉపాధ్యాయులకు ఘన సన్మానం సర్పంచ్ విక్రమ్

ఉపాధ్యాయులకు ఘన సన్మానం సర్పంచ్ విక్రమ్

 ఉపాధ్యాయులకు ఘన సన్మానం సర్పంచ్ విక్రమ్
04-01-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి

ఇంద్రపాలనగరం

భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మార్గదర్శక సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని ఇంద్రపాలనగరంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు, అణగారిన వర్గాల విద్యకు జీవితాంతం పోరాడిన ఆమె సేవలను స్మరించుకుంటూ గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ—భారతదేశంలో తొలి బాలికల పాఠశాలను ప్రారంభించి సమానత్వం, న్యాయం కోసం సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె జన్మదినాన్ని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం విద్యను విప్లవాత్మకంగా మార్చిన ఆమె అపార కృషికి గౌరవ సూచకమని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్లస్వామి జయసుధ, వార్డ్ మెంబర్లు, యువనాయకుడు సింగణబోయిన గణేష్, ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ చైర్మన్ కొమ్మగోని మమత, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు, సీనియర్ నాయకులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

Sthanikam

ఉపాధ్యాయులకు ఘన సన్మానం సర్పంచ్ విక్రమ్

Article Image
రామన్నపేట స్థానికం ప్రతినిధి

ఇంద్రపాలనగరం

భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మార్గదర్శక సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని ఇంద్రపాలనగరంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు, అణగారిన వర్గాల విద్యకు జీవితాంతం పోరాడిన ఆమె సేవలను స్మరించుకుంటూ గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ—భారతదేశంలో తొలి బాలికల పాఠశాలను ప్రారంభించి సమానత్వం, న్యాయం కోసం సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె జన్మదినాన్ని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం విద్యను విప్లవాత్మకంగా మార్చిన ఆమె అపార కృషికి గౌరవ సూచకమని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్లస్వామి జయసుధ, వార్డ్ మెంబర్లు, యువనాయకుడు సింగణబోయిన గణేష్, ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ చైర్మన్ కొమ్మగోని మమత, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు, సీనియర్ నాయకులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News