Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:27 AM

ఉపాధి హామీ చట్టం పేరు మార్పును వ్యతిరేకిస్తూ చిట్యాలలో నిరసన | నూతన బిల్లు ప్రతుల దహనం

ఉపాధి హామీ చట్టం పేరు మార్పును వ్యతిరేకిస్తూ చిట్యాలలో నిరసన | నూతన బిల్లు ప్రతుల దహనం

ఉపాధి హామీ చట్టం పేరు మార్పును వ్యతిరేకిస్తూ చిట్యాలలో నిరసన | నూతన బిల్లు ప్రతుల దహనం
December 24, 2025 11:11 AM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం న్యూస్, చిట్యాల:

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ చిట్యాలలో మంగళవారం నిరసన జ్వాలలు ఎగిరాయి. సీపీఎం, రైతు మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదించిన బిల్లు ప్రతులను నాయకులు దహనం చేశారు.

ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి:

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నగేష్, ఆవిశెట్టి శంకరయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'వీబీ జీ రాంజీ' (VBJ Range) బిల్లును తీవ్రంగా ఖండించారు. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఈ చట్టాన్ని యథావిధిగా కొనసాగాలని, పేరు మార్చకూడదని వారు డిమాండ్ చేశారు. నూతన చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లం మహేష్, జిట్టా సరోజ, మండల నాయకులు ఆరూరి శ్రీను, ఇతరాజు నర్సింహ, కల్లూరిమారస్వామి, కందగట్ల గణేష్, నెల్లికంటి నర్సింహ, బొబ్బిలి సుధాకర్ రెడ్డి, పంది నరేష్, గోపగోని వెంకన్న, లడే శ్రీను, దేశబోయిన సరస్వతి, అనిత, రాములు తదితరులు పాల్గొన్నారు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News