Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:37 PM

ఉపాధి హామీ చట్టం పేరు మార్పును వ్యతిరేకిస్తూ చిట్యాలలో నిరసన | నూతన బిల్లు ప్రతుల దహనం

ఉపాధి హామీ చట్టం పేరు మార్పును వ్యతిరేకిస్తూ చిట్యాలలో నిరసన | నూతన బిల్లు ప్రతుల దహనం

ఉపాధి హామీ చట్టం పేరు మార్పును వ్యతిరేకిస్తూ చిట్యాలలో నిరసన | నూతన బిల్లు ప్రతుల దహనం
December 24, 2025 11:11 AM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం న్యూస్, చిట్యాల:

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ చిట్యాలలో మంగళవారం నిరసన జ్వాలలు ఎగిరాయి. సీపీఎం, రైతు మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదించిన బిల్లు ప్రతులను నాయకులు దహనం చేశారు.

ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి:

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నగేష్, ఆవిశెట్టి శంకరయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'వీబీ జీ రాంజీ' (VBJ Range) బిల్లును తీవ్రంగా ఖండించారు. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఈ చట్టాన్ని యథావిధిగా కొనసాగాలని, పేరు మార్చకూడదని వారు డిమాండ్ చేశారు. నూతన చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లం మహేష్, జిట్టా సరోజ, మండల నాయకులు ఆరూరి శ్రీను, ఇతరాజు నర్సింహ, కల్లూరిమారస్వామి, కందగట్ల గణేష్, నెల్లికంటి నర్సింహ, బొబ్బిలి సుధాకర్ రెడ్డి, పంది నరేష్, గోపగోని వెంకన్న, లడే శ్రీను, దేశబోయిన సరస్వతి, అనిత, రాములు తదితరులు పాల్గొన్నారు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News