Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:00 AM

ఉపాధి హామీ చట్టం పేరు మార్పును వ్యతిరేకిస్తూ చిట్యాలలో నిరసన | నూతన బిల్లు ప్రతుల దహనం

ఉపాధి హామీ చట్టం పేరు మార్పును వ్యతిరేకిస్తూ చిట్యాలలో నిరసన | నూతన బిల్లు ప్రతుల దహనం

ఉపాధి హామీ చట్టం పేరు మార్పును వ్యతిరేకిస్తూ చిట్యాలలో నిరసన | నూతన బిల్లు ప్రతుల దహనం
December 24, 2025 11:11 AM 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం న్యూస్, చిట్యాల:

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ చిట్యాలలో మంగళవారం నిరసన జ్వాలలు ఎగిరాయి. సీపీఎం, రైతు మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదించిన బిల్లు ప్రతులను నాయకులు దహనం చేశారు.

ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి:

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నగేష్, ఆవిశెట్టి శంకరయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'వీబీ జీ రాంజీ' (VBJ Range) బిల్లును తీవ్రంగా ఖండించారు. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఈ చట్టాన్ని యథావిధిగా కొనసాగాలని, పేరు మార్చకూడదని వారు డిమాండ్ చేశారు. నూతన చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లం మహేష్, జిట్టా సరోజ, మండల నాయకులు ఆరూరి శ్రీను, ఇతరాజు నర్సింహ, కల్లూరిమారస్వామి, కందగట్ల గణేష్, నెల్లికంటి నర్సింహ, బొబ్బిలి సుధాకర్ రెడ్డి, పంది నరేష్, గోపగోని వెంకన్న, లడే శ్రీను, దేశబోయిన సరస్వతి, అనిత, రాములు తదితరులు పాల్గొన్నారు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News