Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:21 PM

ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ప్రతిభ బ్లూ ఇన్నోవేటివ్ స్కూల్.

ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ప్రతిభ బ్లూ ఇన్నోవేటివ్ స్కూల్.

ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ప్రతిభ బ్లూ ఇన్నోవేటివ్ స్కూల్.
April 05, 2026 03:32 AM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

విలువలతో కూడిన విద్యను అందించడంలో ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ స్కూల్ అగ్రస్థానం

ప్రాథమిక స్థాయి నుంచే


విద్యార్థులు ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలి కోదాడ మున్సిపల్ 15వ వార్డ్ కౌన్సిలర్ ఇమామే షఫీ, 16వ వార్డ్ కౌన్సిలర్ ఏజాజ్ అహ్మద్ లు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల ప్రక్కన గల ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ స్కూల్ లో స్పోర్ట్స్ మీట్, అండ్ కల్చరల్ ఫెస్ట్ లో ముఖ్య అతిథులు గా పాల్గొని మాట్లాడారు. ప్రాథమిక స్థాయి నుండే పాఠశాల లో ఉన్నత ప్రమాణాలతో ఉన్నత విద్యా అర్హతలు అనుభవం కలిగి ఉన్న ఉపాధ్యాయులు ఉత్తమ విద్యా బోధన చేస్తున్నారని వారిని అభినందించారు. పేద మధ్య తరగతి విద్యార్థులకు కార్పోరేట్ విద్య ను అందిస్తూ పేరు సాధిస్తున్న స్కూల్ ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ స్కూల్ అన్నారు. పాఠశాల కరస్పాండెంట్ షేర్ అలీ మాట్లాడుతూ. పాఠశాలను వ్యాపార దృక్పథం తో కాకుండా సామాజిక సేవా దృక్పథం తో అన్ని వర్గాల పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అతిధులను పాఠశాల యాజమాన్యం పక్షాన ఘనంగా సన్మానించారు. క్రీడల్లో విజేతలకు బహుమతులు అందించారు.అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన లు కేక పుట్టించాయి. ఈ కార్యక్రమం సందర్భంగా పాఠశాల యజమాన్యం వార్డు కౌన్సిలర్లను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రతిభ బ్లూమ్ నందిగామ బ్రాంచ్ ప్రిన్సిపల్ మస్తాన్, ఉపాధ్యాయులు విద్యార్ధులు తల్లి దండ్రులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News