Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:56 AM

ఉద్యమకారుల గుర్తింపుకు అసెంబ్లీలో గళం.. మందుల సామెల్‌కు ధన్యవాదాలు.బొడ్డుపల్లి లింగయ్య

ఉద్యమకారుల గుర్తింపుకు అసెంబ్లీలో గళం.. మందుల సామెల్‌కు ధన్యవాదాలు.బొడ్డుపల్లి లింగయ్య

ఉద్యమకారుల గుర్తింపుకు అసెంబ్లీలో గళం.. మందుల సామెల్‌కు ధన్యవాదాలు.బొడ్డుపల్లి లింగయ్య
January 04, 2026 08:14 AM 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్‌కు ఉద్యమకారుల కృతజ్ఞతలు

రామన్నపేట స్థానికం ప్రతినిధి

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌కు అసెంబ్లీ వేదికగా బలమైన స్వరం వినిపించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్‌కు తెలంగాణ ఉద్యమకారులు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా నాయకులు బొడ్డుపల్లి లింగయ్య ఆధ్వర్యంలో ఈ కృతజ్ఞతలు వెల్లడించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను స్పీకర్ గడ్డం ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిజమైన ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, అర్హులైన వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని వారు కోరారు.

అలాగే ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం కేటాయించడంతో పాటు నెలకు రూ.25 వేల పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులకు తగిన గౌరవం దక్కాల్సిన సమయం ఇదేనని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి హామీలను అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News