Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:40 PM

ఉద్యమకారుల గుర్తింపుకు అసెంబ్లీలో గళం.. మందుల సామెల్‌కు ధన్యవాదాలు.బొడ్డుపల్లి లింగయ్య

ఉద్యమకారుల గుర్తింపుకు అసెంబ్లీలో గళం.. మందుల సామెల్‌కు ధన్యవాదాలు.బొడ్డుపల్లి లింగయ్య

ఉద్యమకారుల గుర్తింపుకు అసెంబ్లీలో గళం.. మందుల సామెల్‌కు ధన్యవాదాలు.బొడ్డుపల్లి లింగయ్య
January 04, 2026 08:14 AM 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్‌కు ఉద్యమకారుల కృతజ్ఞతలు

రామన్నపేట స్థానికం ప్రతినిధి

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌కు అసెంబ్లీ వేదికగా బలమైన స్వరం వినిపించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్‌కు తెలంగాణ ఉద్యమకారులు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా నాయకులు బొడ్డుపల్లి లింగయ్య ఆధ్వర్యంలో ఈ కృతజ్ఞతలు వెల్లడించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను స్పీకర్ గడ్డం ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిజమైన ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, అర్హులైన వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని వారు కోరారు.

అలాగే ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం కేటాయించడంతో పాటు నెలకు రూ.25 వేల పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులకు తగిన గౌరవం దక్కాల్సిన సమయం ఇదేనని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి హామీలను అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News