Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:12 AM

ఉద్యమకారుల గుర్తింపుకు అసెంబ్లీలో గళం.. మందుల సామెల్‌కు ధన్యవాదాలు.బొడ్డుపల్లి లింగయ్య

ఉద్యమకారుల గుర్తింపుకు అసెంబ్లీలో గళం.. మందుల సామెల్‌కు ధన్యవాదాలు.బొడ్డుపల్లి లింగయ్య

ఉద్యమకారుల గుర్తింపుకు అసెంబ్లీలో గళం.. మందుల సామెల్‌కు ధన్యవాదాలు.బొడ్డుపల్లి లింగయ్య
January 04, 2026 08:14 AM 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్‌కు ఉద్యమకారుల కృతజ్ఞతలు

రామన్నపేట స్థానికం ప్రతినిధి

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌కు అసెంబ్లీ వేదికగా బలమైన స్వరం వినిపించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్‌కు తెలంగాణ ఉద్యమకారులు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా నాయకులు బొడ్డుపల్లి లింగయ్య ఆధ్వర్యంలో ఈ కృతజ్ఞతలు వెల్లడించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను స్పీకర్ గడ్డం ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిజమైన ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, అర్హులైన వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని వారు కోరారు.

అలాగే ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం కేటాయించడంతో పాటు నెలకు రూ.25 వేల పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులకు తగిన గౌరవం దక్కాల్సిన సమయం ఇదేనని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి హామీలను అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News