Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:44 AM

ఉద్యోగం దొరకక ఆవేదన… రైలుకింద పడి యువకుడి మృతి

ఉద్యోగం దొరకక ఆవేదన… రైలుకింద పడి యువకుడి మృతి

ఉద్యోగం దొరకక ఆవేదన… రైలుకింద పడి యువకుడి మృతి
04-04-2026 135 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఉన్నత చదువులు పూర్తిచేసుకున్నప్పటికీ సరైన ఉద్యోగం దొరకక మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. నార్కట్‌పల్లి శివారులో రైలు కింద పడి యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు.మృతుడిని చిట్యాల మండలం ఎలికట్టె గ్రామానికి చెందిన కొండకింది హరీష్ రెడ్డి (28)గా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.హరీష్ రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ, తగిన ఉద్యోగం రాకపోవడంతో కొంతకాలంగా తీవ్ర నిరాశలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి లోనై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Sthanikam

ఉద్యోగం దొరకక ఆవేదన… రైలుకింద పడి యువకుడి మృతి

Article Image

ఉన్నత చదువులు పూర్తిచేసుకున్నప్పటికీ సరైన ఉద్యోగం దొరకక మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. నార్కట్‌పల్లి శివారులో రైలు కింద పడి యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు.మృతుడిని చిట్యాల మండలం ఎలికట్టె గ్రామానికి చెందిన కొండకింది హరీష్ రెడ్డి (28)గా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.హరీష్ రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ, తగిన ఉద్యోగం రాకపోవడంతో కొంతకాలంగా తీవ్ర నిరాశలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి లోనై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News