Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:18 PM

ఉద్యోగం దొరకక ఆవేదన… రైలుకింద పడి యువకుడి మృతి

ఉద్యోగం దొరకక ఆవేదన… రైలుకింద పడి యువకుడి మృతి

ఉద్యోగం దొరకక ఆవేదన… రైలుకింద పడి యువకుడి మృతి
April 04, 2026 04:20 PM 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఉన్నత చదువులు పూర్తిచేసుకున్నప్పటికీ సరైన ఉద్యోగం దొరకక మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. నార్కట్‌పల్లి శివారులో రైలు కింద పడి యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు.మృతుడిని చిట్యాల మండలం ఎలికట్టె గ్రామానికి చెందిన కొండకింది హరీష్ రెడ్డి (28)గా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.హరీష్ రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ, తగిన ఉద్యోగం రాకపోవడంతో కొంతకాలంగా తీవ్ర నిరాశలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి లోనై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News