Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:56 AM

ఉద్యోగం దొరకక ఆవేదన… రైలుకింద పడి యువకుడి మృతి

ఉద్యోగం దొరకక ఆవేదన… రైలుకింద పడి యువకుడి మృతి

ఉద్యోగం దొరకక ఆవేదన… రైలుకింద పడి యువకుడి మృతి
April 04, 2026 04:20 PM 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఉన్నత చదువులు పూర్తిచేసుకున్నప్పటికీ సరైన ఉద్యోగం దొరకక మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. నార్కట్‌పల్లి శివారులో రైలు కింద పడి యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు.మృతుడిని చిట్యాల మండలం ఎలికట్టె గ్రామానికి చెందిన కొండకింది హరీష్ రెడ్డి (28)గా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.హరీష్ రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ, తగిన ఉద్యోగం రాకపోవడంతో కొంతకాలంగా తీవ్ర నిరాశలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి లోనై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News