ఉద్యోగం దొరకక ఆవేదన… రైలుకింద పడి యువకుడి మృతి
ఉద్యోగం దొరకక ఆవేదన… రైలుకింద పడి యువకుడి మృతి
Komidala Mahender reddy
ఉన్నత చదువులు పూర్తిచేసుకున్నప్పటికీ సరైన ఉద్యోగం దొరకక మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. నార్కట్పల్లి శివారులో రైలు కింద పడి యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు.మృతుడిని చిట్యాల మండలం ఎలికట్టె గ్రామానికి చెందిన కొండకింది హరీష్ రెడ్డి (28)గా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.హరీష్ రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ, తగిన ఉద్యోగం రాకపోవడంతో కొంతకాలంగా తీవ్ర నిరాశలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి లోనై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి