ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ‘చలో హైదరాబాద్’ 31న కేకే కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలి : బొడ్డుపల్లి లింగయ్య.
ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ‘చలో హైదరాబాద్’ 31న కేకే కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలి : బొడ్డుపల్లి లింగయ్య.
Editor Desk
తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు, త్యాగాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ సభ్యులతో ఈ నెల 31న హైదరాబాద్లో నిర్వహించే సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమ నాయకులు బొడ్డుపల్లి లింగయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమకారుల గుర్తింపు, వారి సమస్యల పరిష్కారం, ఉద్యమ సమయంలో నష్టపోయిన వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కేకే కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఉద్యమకారుల సూచనలు, సలహాలు, అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
టి యు టి ఎఫ్ (TUTF) వ్యవస్థాపకులు చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి పది జిల్లాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు, ఉద్యమ నాయకులు పెద్ద ఎత్తున హాజరై సదస్సును విజయవంతం చేయాలని కోరారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి