PRINT TIME: March 26, 2026 10:05 PM
ఉద్యమ వీరుడికి ఘన నివాళి
ఉద్యమ వీరుడికి ఘన నివాళి
March 26, 2026 08:25 PM
0 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
ఉద్యమాల యుద్ధభేరి సాంబశివుని వర్ధంతి సందర్భంగా గోకారం స్టేజి వద్ద ఏర్పాటు చేసిన స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, చిట్యాల మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం పాల్గొని సాంబశివుని సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సాంబశివుడు చేసిన త్యాగాలు, పోరాట పటిమ యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల పాత్రను ఎప్పటికీ మర్చిపోరాదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ ఏర్పుల నరసింహ, వార్డు సభ్యులు కురు యాదయ్య, సాగర్ల నాగరాజు తదితరులు పాల్గొని సాంబశివుని స్తూపానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు సమర్పించారు.
స్థానిక ప్రజలు, యువకులు కూడా పెద్ద ఎత్తున హాజరై ఉద్యమ వీరుడి జ్ఞాపకాలను స్మరించుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి