ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దాం. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.
ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దాం. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.
Editor Desk
నకిరేకల్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నకిరేకల్ మండల పరిధిలో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ ఉద్యమం, అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని పేర్కొన్నారు.
“ఉద్యమ తెలంగాణ.. ఉజ్వల తెలంగాణ”గా రూపుదిద్దుకుందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నాయకత్వంలో మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, పరిపాలనా రంగాల్లో విశేష పురోగతి సాధించిందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని, రాష్ట్ర అభివృద్ధి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి