ఉచిత గాలికుంటు టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.. సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి
ఉచిత గాలికుంటు టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.. సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి
Bandi Kiran Kumar
తుంగతుర్తి;ప్రభుత్వం అందించే పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో పశువులకు ఉచిత గాలికుంటు నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. అనంతరం పశువులకు ఉచిత గాలి కుంటూ మందులను పంపిణీ చేశారు. పశువులు రోగాలు బారిన పడకుండా ఈ టీకాలు వేసినట్లయితే ఆరోగ్యంగా ఉంటాయని అన్నారు. గ్రామంలో ఈ టీకాలు ఈరోజు నుండి మూడు రోజుల వరకు పశు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వేస్తారని అన్నారు. కావునప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలో ఆవులు 31, గేదలు 76 మొత్తం 107 పశువులకు టీకాలు వేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెలిశాల సరిత, మండల పశు వైద్య అధికారి నరేష్, సిబ్బంది రవి, రాజశేఖర్, లింగయ్య, శ్రీను, రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి