ఉచిత రక్త పరీక్ష కేంద్రానికి విశేష స్పందన
ఉచిత రక్త పరీక్ష కేంద్రానికి విశేష స్పందన
Krishna
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి
షాహిరీ జమీయత్ ఆహేలె హదీస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత రక్త పరీక్ష కేంద్రానికి విశేష స్పందన లభించిందని సంస్థ బాధ్యులు అబ్దుల్ నయీం (ఆసిఫ్), మంజర్, అబ్దుల్ మోహిత్ తెలిపారు.నారాయణఖేడ్ పట్టణంలోని ఇబ్రహీం మసీదు వద్ద గ్లోబల్ డయాగ్నోస్టిక్స్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ ఉచిత రక్త పరీక్ష కేంద్రంలో మొత్తం 260 మంది ప్రజలకు రక్త పరీక్షలు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ దిశగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ముందస్తు వైద్య పరీక్షల ద్వారా అనారోగ్యాలను గుర్తించి సరైన చికిత్స పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉచిత వైద్య సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సహకారం అందించారని, గ్లోబల్ డయాగ్నోస్టిక్స్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి