PRINT TIME: May 26, 2026 04:20 PM
టోల్ప్లాజాల్లో నేడు నుంచి నగదు చెల్లింపులకు గుడ్బై
టోల్ప్లాజాల్లో నేడు నుంచి నగదు చెల్లింపులకు గుడ్బై
April 10, 2026 10:12 AM
29 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
దేశవ్యాప్తంగా టోల్ప్లాజాల్లో నేటి నుంచి నగదు చెల్లింపులను నిలిపివేశారు. ఇకపై వాహనదారులు తప్పనిసరిగా ఫాస్టాగ్ ద్వారా మాత్రమే టోల్ రుసుములు చెల్లించాలి. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఫాస్టాగ్ లేకుండా టోల్ప్లాజాలకు వచ్చే వాహనదారులకు సాధారణ రుసుముతో పోలిస్తే 1.25 రెట్లు అధిక చార్జీలు విధించనున్నట్లు స్పష్టం చేశారు. అందువల్ల వాహనదారులు ముందుగానే ఫాస్టాగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ మార్పుతో టోల్ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం తగ్గి, ప్రయాణం మరింత సులభంగా మారుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి