TMR–AMRకు ప్రతిష్ఠగా సర్పంచ్ సమరం
TMR–AMRకు ప్రతిష్ఠగా సర్పంచ్ సమరం
స్థానికం బృందం
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
రామన్నపేట మండలం వెల్లంకిలో సర్పంచ్ ఎన్నిక హాట్టాపిక్గా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్రెడ్డి (TMR), మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్రెడ్డి (AMR)లకు ప్రతిష్ఠగా నిలుస్తోంది.
కాంగ్రెస్ అభ్యర్థి గంజి భార్గవి భాస్కర్ విజయం కోసం TMR అన్ని వర్గాలను కలుపుకొని విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. గ్రామంలోని ప్రతి గడపను తట్టుతూ ఓటర్లను ఒప్పించే ప్రయత్నంలో చెమటోడుస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి ఈడెం రాధ శ్రీనివాస్ గెలుపే లక్ష్యంగా AMR అహర్నిశలు శ్రమిస్తూ వ్యూహాలు అమలు చేస్తున్నారు.
కొన్నాళ్లుగా రాజకీయంగా బద్ధశత్రువులుగా మారిన TMR–AMRల మధ్య ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. తమ అభ్యర్థిని గెలిపించి సత్తా చాటాలని ఇద్దరూ ఉవ్విళ్లూరుతుండటంతో వెల్లంకి గ్రామం రాజకీయ కదనరంగంగా మారింది. ఫలితం ఎవరి వైపు మొగ్గుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి