Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:24 PM

TMR–AMRకు ప్రతిష్ఠగా సర్పంచ్ సమరం

TMR–AMRకు ప్రతిష్ఠగా సర్పంచ్ సమరం

 TMR–AMRకు ప్రతిష్ఠగా సర్పంచ్ సమరం
December 13, 2025 08:00 PM 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలం వెల్లంకిలో సర్పంచ్ ఎన్నిక హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్‌రెడ్డి (TMR), మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్‌రెడ్డి (AMR)లకు ప్రతిష్ఠగా నిలుస్తోంది.

కాంగ్రెస్ అభ్యర్థి గంజి భార్గవి భాస్కర్ విజయం కోసం TMR అన్ని వర్గాలను కలుపుకొని విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. గ్రామంలోని ప్రతి గడపను తట్టుతూ ఓటర్లను ఒప్పించే ప్రయత్నంలో చెమటోడుస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ అభ్యర్థి ఈడెం రాధ శ్రీనివాస్ గెలుపే లక్ష్యంగా AMR అహర్నిశలు శ్రమిస్తూ వ్యూహాలు అమలు చేస్తున్నారు.

కొన్నాళ్లుగా రాజకీయంగా బద్ధశత్రువులుగా మారిన TMR–AMRల మధ్య ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. తమ అభ్యర్థిని గెలిపించి సత్తా చాటాలని ఇద్దరూ ఉవ్విళ్లూరుతుండటంతో వెల్లంకి గ్రామం రాజకీయ కదనరంగంగా మారింది. ఫలితం ఎవరి వైపు మొగ్గుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News