Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:50 PM

టిపిటిఎల్ఎఫ్ జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ

టిపిటిఎల్ఎఫ్ జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ

టిపిటిఎల్ఎఫ్ జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ
January 12, 2026 06:53 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

విద్యారంగ అభివృద్ధికి ప్రైవేటు ఉపాధ్యాయుల సేవలు మరింత విస్తరించాలి

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

సూర్యాపేట:

విద్యారంగ అభివృద్ధిలో ప్రైవేటు ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, వారి సేవలు భవిష్యత్ తరాలకు బలమైన పునాదిగా నిలుస్తాయని సూర్యాపేట జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కమిటీ ముద్రించిన క్యాలెండర్‌ను ఆయన ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…

ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు విద్యాసంస్థలు కూడా సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. పరిమిత వసతులు, ఎన్నో సవాళ్ల మధ్య కూడా ప్రైవేటు ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ విద్యారంగానికి విశేష సేవలు చేస్తున్నారని ప్రశంసించారు. నేటి విద్య కేవలం పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా, విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసాన్ని లక్ష్యంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత ముఖ్యమని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ బోధనా పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి విద్యార్థులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. టెక్నాలజీ ఆధారిత బోధనతో విద్యార్థుల అవగాహన, ఆలోచనా శక్తి మరింత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిపిటిఎల్ఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు జే. నరసింహారావు మాట్లాడుతూ, ప్రైవేటు ఉపాధ్యాయుల హక్కులు, సమస్యలు, గౌరవం కోసం ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఈ క్యాలెండర్ ద్వారా ఉపాధ్యాయుల్లో ఐక్యత, సంఘబలం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు ఎం. సోమరాజ్, గోపాల్ దాస్, శ్రీరాములు, టిపిటిఎల్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బత్తిని శ్రీనివాస్, పాల్వయి శ్రీనివాస్, కారంగుల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదాస్ కృష్ణ, కోశాధికారి డి. నాగమణి, సహాయ కార్యదర్శులు జి. రమేష్ రాజశేఖర్, కీత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News