Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:50 PM

టికెట్ నంబర్ ఒకటి.. బస్సు నంబర్ మరోటి.. జహీరాబాద్‌లో కర్ణాటక బస్సుల గందరగోళం

టికెట్ నంబర్ ఒకటి.. బస్సు నంబర్ మరోటి.. జహీరాబాద్‌లో కర్ణాటక బస్సుల గందరగోళం

టికెట్ నంబర్ ఒకటి.. బస్సు నంబర్ మరోటి.. జహీరాబాద్‌లో కర్ణాటక బస్సుల గందరగోళం
January 13, 2026 08:44 AM 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:జహీరాబాద్ గుండా వెళ్లే కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొన్ని బస్సులు ప్రయాణికులకు ఇస్తున్న టికెట్‌పై ఉన్న బస్సు సంఖ్యకు, బస్సుపై ఉన్న నిజమైన సంఖ్యకు ఏమాత్రం పొంతన లేకుండా నడుస్తుండటం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని డివైఎఫ్ఐ జహీరాబాద్ పట్టణ కమిటీ కార్యదర్శి జే. శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ విధమైన అవకతవకలు ప్రయాణికుల భద్రతకు ముప్పుగా మారుతున్నాయని ఆయన అన్నారు.ఈ విషయమై డివైఎఫ్ఐ నాయకులు ఈరోజు మోటార్ వాహనాల తనిఖీ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, వాస్తవంగా రోడ్డు మీద నడుస్తున్న బస్సు సంఖ్యకు, ప్రయాణికులకు ఇస్తున్న టికెట్‌పై ముద్రించిన సంఖ్యకు తేడా ఉండటం చట్ట విరుద్ధమని తెలిపారు. ఈ విషయం గురించి కండక్టర్లను, డ్రైవర్లను ప్రశ్నిస్తే “మేము ఉద్యోగులం, అధికారులతో మాట్లాడాలి” అని సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలా బస్సులు నడిపితే ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ఆయన ప్రశ్నించారు. “మాకు తెలియదు” అని చెప్పడం ద్వారా బాధ్యత నుంచి తప్పించుకోవడం సరైనది కాదని స్పష్టం చేశారు. తక్షణమే సంబంధిత రవాణా అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. టికెట్‌పై ఉన్న సంఖ్యకు, బస్సుపై ఉన్న సంఖ్యకు తేడా ఉన్న బస్సులను వెంటనే నిలిపివేసి స్వాధీనం చేసుకోవాలని కోరారు.డివైఎఫ్ఐ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు తిరుపతి మాట్లాడుతూ, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి వ్యవహారాలను సహించబోమని హెచ్చరించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు జోనా నరేష్, సంగమేశ్వర, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News