తుమ్మగూడెం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించిన ఏవో బి శివశంకర్
తుమ్మగూడెం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించిన ఏవో బి శివశంకర్
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి జనవరి 20(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని తుమ్మగూడెం గ్రామం నందు మండల వ్యవసాయ అధికారి బండారు శివశంకర్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా రైతులకు మొక్కజొన్న సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు నీటి యాజమాన్య పద్ధతులు, నానో యూరియా మరియు నానో డి ఏ పి ఉపయోగాలను తెలియజేశారు. మొక్కజొన్నలో కాండం తోలుచు పురుగు, కత్తెర పురుగు మరియు గులాబీ రంగు పురుగు నియంత్రణ పద్ధతులు గురించి వివరించారు. రైతులకు ప్రధాన తెగుళ్లు అయిన ఆకు ఎండు తెగులు, తుప్పు తెగుళ్లు,కుళ్ళు తెగుళ్లు ఎలా గుర్తించాలో వివరించారు. తెగుళ్లు గుర్తించినప్పుడు మంకోజెబ్ 2.5 గ్రామ్స్/ ఒక లీటర్ నీటికి కలిపి (లేదా) ప్రోపేకోనజోల్ 200 మిల్లీలీటర్లు /200 లీ. నీటిలో కలిపి పిచికారి చేసిన ఎడల నియంత్రించవచ్చని, రైతులు ఖచ్చితంగా తాము పండించే పంటను ఈ పంటను నమోదు చేసుకోవాలని రైతులు APFR నందు విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందవలెనని తెలియజేశారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి