Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:52 PM

తుంగతుర్తి మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశాలకు ఆహ్వానం

తుంగతుర్తి మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశాలకు ఆహ్వానం

తుంగతుర్తి మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశాలకు ఆహ్వానం
January 23, 2026 08:48 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి బండి కిరణ్

తుంగతుర్తి మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో 2026 _27వ విద్యాసంవత్సరానికి ఐదవ తరగతి కి ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఏ ఉమా రెడ్డి తెలిపారు, శుక్రవారం పాఠశాలలో మైనారిటీ నాయకులతో కలిసి ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు, తమ పాఠశాలలో ఐదవ తరగతిలో 80 సీట్లు ఉండగా అందులో 52 సీట్లు మైనార్టీలకు మిగతా సీట్లు నాన్ మైనార్టీ కి కేటాయించినట్లు తెలిపారు, 6,7,8 తరగతులలో బ్యాక్లాగ్ సీట్లు ఉన్నాయని అవి కూడా భర్తీ చేయనున్నట్లు తెలిపారు, అంతేకాక జూనియర్ కళాశాలలో ఎం ఇ సి, సీఈసీ, కోర్సులు ఉన్నాయని 40 సీట్లలో 28 సీట్లు మైనార్టీ విద్యార్థులతో భర్తీ చేయనున్నట్లు తెలిపారు, మైనారిటీ విద్యార్థులతో పాటు ఇతర వర్గాల విద్యార్థులకు కూడా కొన్ని సీట్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు, అర్హులైన వారందరూ నేటి నుండి సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని అన్నారు, ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య తో పాటు హాస్టల్ వసతి భోజనం, యూనిఫామ్ దుస్తులు, పుస్తకాలు అందజేయనున్నట్లు తెలిపారు, అర్హులైన మైనారిటీ విద్యార్థులు నేరుగా పాఠశాలకు వచ్చి సీటు రిజర్వ్ చేసుకోవచ్చని లేదా ఫోన్ నెంబర్ 9908380590,7995057967 లొ సంప్రదించవచ్చని తెలిపారు, అంతకుముందు శుక్రవారం నమాజ్ సందర్భంగా స్థానిక మసీదులో మైనార్టీ నాయకులు మైనార్టీ గురుకుల ప్రవేశాలకు సంబంధించి పోస్టర్లు ఆవిష్కరించారు, ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు షేక్ హబీబ్. టి లక్ష్మణ్, సిహెచ్ చిరంజీవి, పి రాంబాబు, ఆర్ వెంకటేశ్వర్లు, తో పాటు మైనారిటీ నాయకులు మత గురువు మూలాన అబ్దుల్ ఆహాద్, ఎండి జాన్, షేక్ లాల్, అలీ సాబ్, షేక్ అన్వర్, అబ్దుల్లా, కరీం, వహీద్, సిద్ధిక్, అక్రమ్, తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News