PRINT TIME: May 26, 2026 03:52 PM
తుంగతుర్తి లో ఘనంగా సావిత్రిబాయి వర్ధంతి వేడుకలు
తుంగతుర్తి లో ఘనంగా సావిత్రిబాయి వర్ధంతి వేడుకలు
March 10, 2026 12:39 PM
74 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి వర్ధంతి సందర్భంగా తుంగతుర్తి మండలకేంద్రం లోని విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. సమాజంలో మహిళా సమానత్వం కోసం పోరాడిన మహనీయురాలు సావిత్రీబాయి అన్నారు.. మహిళలకు విద్య నేర్చుకోవాల్సిన అవశ్యకతను గుర్తించి తొలి మహిళా పాఠశాలను ప్రారంభించిన సంఘసంస్కర్త సావిత్రీబాయి అన్నారు. తనభర్త జ్యోతి బా పూలే అడుగుజాడలో నడిచిన వీరవనిత సావిత్రీబాయి పూలే అన్నారు. ఆమెయొక్క త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియచేయాల్సిన బాధ్యత మనందరిమీద ఉందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు సాయిలు. గోపగాని రమేష్. పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్. గోపగాని వెంకన్న. లథీబ్. మల్లికార్జున. సాయి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి