వికారాబాద్ జిల్లా బంట్వరం మండలం తొర్మామిడి గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా 91 మంది విద్యార్థులు చేరడం పట్ల సంతోషం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా అదే పాఠశాలలో విద్యాభ్యాసం చేసి ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఎం. సాయి కీర్తన తన చదువు మొదలైన పాఠశాలకు ప్రింటర్ను అందజేశారు.ఈ కార్యక్రమంలో సాయి కీర్తన తండ్రి లలిత్ కుమార్ ఆమెను ఘనంగా సన్మానించగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన సాయి కీర్తనను అందరూ అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవ్యా నాయక్, సిబ్బంది ఉమామహేశ్వరి, రేష్మ, రాధ, సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి