తిరువూరు పట్టణంలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసిన ముగ్గురు రేషన్ డీలర్లపై అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా పౌర సరఫరాల అధికారి వాణి ఆదేశాల మేరకు డీలర్లు సునీత, దుర్గారాణి, ఆనందకుమారి డీలర్షిప్లను సస్పెండ్ చేశారు.
వారి వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 4.50 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పీడీఎస్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి