Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 11, 2026 09:46 PM

తిరువూరు లో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఆకస్మిక దాడి 4.60 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం – ఆటో డ్రైవర్ అరెస్ట్

తిరువూరు లో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఆకస్మిక దాడి 4.60 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం – ఆటో డ్రైవర్ అరెస్ట్

తిరువూరు లో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఆకస్మిక దాడి 4.60 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం – ఆటో డ్రైవర్ అరెస్ట్
March 11, 2026 07:23 PM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు: ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఘటనను అధికారులు బయటపెట్టారు. సమాచారం అందిన వెంటనే పిడిఎస్ డీటీ కొంగర శ్వేత ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.

తిరువూరు పట్టణంలోని రాజుపేట ప్రాంతం నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆటోను అధికారులు తనిఖీ చేయగా, అందులో సుమారు 4.60 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ఆటోను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం ఆటోను స్థానిక పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసిన పోలీసులు ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అత్యవసర వస్తువుల చట్టం ప్రకారం 6-ఏ కేసు నమోదు చేసినట్లు పిడిఎస్ డీటీ కొంగర శ్వేత తెలిపారు.

ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం లేదా రవాణా చేయడం చట్ట విరుద్ధమని, ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News