Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:42 PM

తిరువూరు లో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఆకస్మిక దాడి 4.60 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం – ఆటో డ్రైవర్ అరెస్ట్

తిరువూరు లో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఆకస్మిక దాడి 4.60 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం – ఆటో డ్రైవర్ అరెస్ట్

తిరువూరు లో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఆకస్మిక దాడి 4.60 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం – ఆటో డ్రైవర్ అరెస్ట్
March 11, 2026 07:23 PM 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు: ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఘటనను అధికారులు బయటపెట్టారు. సమాచారం అందిన వెంటనే పిడిఎస్ డీటీ కొంగర శ్వేత ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.

తిరువూరు పట్టణంలోని రాజుపేట ప్రాంతం నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆటోను అధికారులు తనిఖీ చేయగా, అందులో సుమారు 4.60 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ఆటోను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం ఆటోను స్థానిక పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసిన పోలీసులు ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అత్యవసర వస్తువుల చట్టం ప్రకారం 6-ఏ కేసు నమోదు చేసినట్లు పిడిఎస్ డీటీ కొంగర శ్వేత తెలిపారు.

ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం లేదా రవాణా చేయడం చట్ట విరుద్ధమని, ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News