తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి కార్యక్రమం
తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి కార్యక్రమం
GADDAM JAGANMOHAN REDDY
తిరువూరు జనవరి 30(స్ధానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ లో జాతిపిత మహాత్మా గాంధీ 78 వ వర్ధంతిని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్భంగా తిరువూరు మండల, పట్టణ మరియు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు, జీవన్ బాబు, బొడ్డు ప్రకాశరావు,ఉప్పలపాటి లక్ష్మీ దాస్,గంజా కృష్ణమోహన్, ఊటుకూరు అశోక్ కుమార్, రామిశెట్టి శ్రీనివాసరావు, మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యం,అహింస,సత్యాగ్రహం,ఉప్పు సత్యాగ్రహం,దండి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలతో దేశమంతటా తిరిగి ప్రజలను చైతన్య పరచి బ్రిటీష్ వారి పాలనను పాలనను పాలనను పారద్రోలి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన మహనీయుడని,అలాంటి మహనీయుడిని గాడ్సే అనే మతోన్మాద దుర్మాగుడు ఆయనను అత్య చేసి భౌతికంగా లేకుండా చేశారని,ఈనాటి పాలకులు ఆయన పేరును జాతీయ ఉపాధి హామీ పథకానికి తొలగించినారని,ఆయన పేరును ఉపాధి హామీ పథకానికి కొనసాగించాలని బి. జె.పి.ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.అదేవిధంగా స్వాతంత్ర్య పోరాటవీరుల సంస్మరణ దినోత్సవము సందర్భంగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న త్యాగమూర్తులకు నివాళులు అర్పించడం జరిగినది.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్తగుండ్ల గోపాలకృష్ణ, డాక్టర్ కడియాల నాగేశ్వరరావు, పర్వతం రామారావు, రామిశెట్టి శ్రీనివాసరావు, చావుల రంగయ్య, మత్తి మోహనరావు, కుంచం చంద్రరావు, మేకల రవి,షేక్ సుభాని, పల్లెపాటి చరణ్ సాయి, గరికపాటి నరసింహారావు, యద్దనపూడి రాములు, కొంగల ఆదాం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి