తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
GADDAM JAGANMOHAN REDDY
తిరువూరు జనవరి 27(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన రెడ్డి) ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు ప్రకాశరావు జాతీయ జండా ఆవిష్కరించి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ధన, మాన, ప్రాణాలను పణంగాపెట్టి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టి అసువులు బాసిన నాయకులను మీరు కూడదని అన్నారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర బి.సి.సెల్ నాయకులు జీవన్ బాబు, గంజా కృష్ణమోహన్ లు మాట్లాడుతూ ఈ రోజు రాజ్యాంగం అమలు లోనికి వచ్చిన రోజు అని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉన్నదని, రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకు అందిన రోజున నాయకులు కన్న కలలు నెరవేరినట్లని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు, డాక్టర్ కడియాల నాగేశ్వరరావు, ఇమ్మనేని శ్రీనివాసరావు, రామిశెట్టి శ్రీనివాసరావు, గుడిమెట్ల మోహన్ రావు, కొత్తగుండ్ల గోపాలకృష్ణ, జీడిమల్ల వెంకటేశ్వరరావు, పర్వతం రామారావు, ఉప్పలపాటి లక్ష్మీ దాస్, పల్నాటి సత్యనారాయణ, నభిషా,షేక్ సుభాని, పగుట్ల చంద్రయ్య, బెంజిమెన్, గంధం శ్రీనివాసరావు,గరికపాటి నరసింహారావు, కొంగల ఆదాం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి