కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర
రామన్నపేట :
మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్రెడ్డి తండ్రి తిమ్మాపురం నారాయణరెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర శుక్రవారం వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, నారాయణరెడ్డి సేవలను స్మరించుకున్నారు. వారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి