తీవ్ర వడదెబ్బతో మందోళ్లగూడెంలో వ్యక్తి మృతి
తీవ్ర వడదెబ్బతో మందోళ్లగూడెంలో వ్యక్తి మృతి
K.RAVI
అస్వస్థతకు గురై దేవరకొండ శంకరయ్య చారి (52) కన్నుమూత
చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం గ్రామంలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవరకొండ శంకరయ్య చారి (52) వడదెబ్బకు గురై మరణించారు. గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతుండటంతో భానుడి భగభగలకు శంకరయ్య చారి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. శనివారం ఎండ తీవ్రత తట్టుకోలేక ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో శంకరయ్య చారి మార్గమధ్యంలోనే కన్నుమూశారు.
గ్రామంలో అందరితో ఎంతో ఆప్యాయంగా, కలుపుగోరుగా ఉండే శంకరయ్య చారి హఠాన్మరణంతో మందోళ్లగూడెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శంకరయ్య చారి మరణవార్త తెలిసిన వెంటనే గ్రామ ప్రముఖులు, బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి