Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:02 AM

తీవ్ర వడదెబ్బతో మందోళ్లగూడెంలో వ్యక్తి మృతి

తీవ్ర వడదెబ్బతో మందోళ్లగూడెంలో వ్యక్తి మృతి

తీవ్ర వడదెబ్బతో మందోళ్లగూడెంలో వ్యక్తి మృతి
23-05-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అస్వస్థతకు గురై దేవరకొండ శంకరయ్య చారి (52) కన్నుమూత

చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం గ్రామంలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవరకొండ శంకరయ్య చారి (52) వడదెబ్బకు గురై మరణించారు.​ గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతుండటంతో భానుడి భగభగలకు శంకరయ్య చారి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. శనివారం ఎండ తీవ్రత తట్టుకోలేక ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో శంకరయ్య చారి మార్గమధ్యంలోనే కన్నుమూశారు.

​గ్రామంలో అందరితో ఎంతో ఆప్యాయంగా, కలుపుగోరుగా ఉండే శంకరయ్య చారి హఠాన్మరణంతో మందోళ్లగూడెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శంకరయ్య చారి మరణవార్త తెలిసిన వెంటనే గ్రామ ప్రముఖులు, బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Sthanikam

తీవ్ర వడదెబ్బతో మందోళ్లగూడెంలో వ్యక్తి మృతి

Article Image

అస్వస్థతకు గురై దేవరకొండ శంకరయ్య చారి (52) కన్నుమూత

చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం గ్రామంలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవరకొండ శంకరయ్య చారి (52) వడదెబ్బకు గురై మరణించారు.​ గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతుండటంతో భానుడి భగభగలకు శంకరయ్య చారి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. శనివారం ఎండ తీవ్రత తట్టుకోలేక ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో శంకరయ్య చారి మార్గమధ్యంలోనే కన్నుమూశారు.

​గ్రామంలో అందరితో ఎంతో ఆప్యాయంగా, కలుపుగోరుగా ఉండే శంకరయ్య చారి హఠాన్మరణంతో మందోళ్లగూడెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శంకరయ్య చారి మరణవార్త తెలిసిన వెంటనే గ్రామ ప్రముఖులు, బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News