Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:46 PM

తీవ్ర వడదెబ్బతో మందోళ్లగూడెంలో వ్యక్తి మృతి

తీవ్ర వడదెబ్బతో మందోళ్లగూడెంలో వ్యక్తి మృతి

తీవ్ర వడదెబ్బతో మందోళ్లగూడెంలో వ్యక్తి మృతి
May 23, 2026 05:03 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అస్వస్థతకు గురై దేవరకొండ శంకరయ్య చారి (52) కన్నుమూత

చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం గ్రామంలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవరకొండ శంకరయ్య చారి (52) వడదెబ్బకు గురై మరణించారు.​ గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతుండటంతో భానుడి భగభగలకు శంకరయ్య చారి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. శనివారం ఎండ తీవ్రత తట్టుకోలేక ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో శంకరయ్య చారి మార్గమధ్యంలోనే కన్నుమూశారు.

​గ్రామంలో అందరితో ఎంతో ఆప్యాయంగా, కలుపుగోరుగా ఉండే శంకరయ్య చారి హఠాన్మరణంతో మందోళ్లగూడెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శంకరయ్య చారి మరణవార్త తెలిసిన వెంటనే గ్రామ ప్రముఖులు, బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News