Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:35 AM

తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు సంక్రాంతి ముగ్గులు నిలయం.

తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు సంక్రాంతి ముగ్గులు నిలయం.

తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు సంక్రాంతి ముగ్గులు నిలయం.
January 14, 2026 04:06 PM 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ముగ్గుల పోటీల్లో మహిళల సృజనాత్మకత ప్రతిబింబం: మట్టి పెళ్లి సైదులు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు సంక్రాంతి ముగ్గులు ప్రతీకలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు అన్నారు. బుధవారం మోతే మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సైదులు మాట్లాడుతూ, మహిళలకు అత్యంత ఇష్టమైన పండుగలలో సంక్రాంతి ఒకటని అన్నారు. మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడంలో ముగ్గుల పోటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం మన సంప్రదాయాలను గౌరవించినట్లేనని తెలిపారు. ముగ్గుల పోటీల్లో విజయం సాధించిన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు, పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు జంపాల స్వరాజ్యం, మండల ప్రధాన కార్యదర్శి కిన్నెర పోతయ్య, మండల కమిటీ సభ్యులు బోడ పట్ల హుస్సేన్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కెనపల్లి వినయ్, విద్యార్థి నాయకురాలు మట్టిపల్లి మానస, సంఘం నాయకురాలు కటారి పార్వతమ్మ, కుంటి గొర్ల గంగమ్మ, చిట్యాల పద్మ, జంపాల ఉప్పయ్య, అక్కెనపల్లి నాగమ్మ, బోడ పట్ల సాంబమ్మ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News