తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
Biksham
టీఆర్పీ పార్టీలోకి కొత్త నాయకుల చేరిక
పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై నాయకుల జాయినింగ్
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్
శ్రీ వట్టె జానయ్య గారి ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి నీరజ గౌడ్ గారు
కొత్తగా పార్టీలో చేరిన ఆర్. శ్రీదేవి, ఏ. నళినిలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వట్టె జానయ్య గారు మాట్లాడుతూ,
తెలంగాణలో మెజారిటీ వర్గాలకు రాజ్యాధికారంలో వాటా దక్కేవరకు టీఆర్పీ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేవలం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉన్న అధికారాన్ని సామాన్య ప్రజలకు అందించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలకు ఆకర్షితులై యువకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీలోకి చేరడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు మంజుల గౌడ్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, కార్యదర్శి మల్లేష్ యాదవ్,పెన్పహాడ్ అధ్యక్షుడు ఆవుల అంజయ్య, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కోల కరుణాకర్త దితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి