Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:49 PM

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
January 09, 2026 08:22 PM 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

టీఆర్పీ పార్టీలోకి కొత్త నాయకుల చేరిక

పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై నాయకుల జాయినింగ్

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్

శ్రీ వట్టె జానయ్య గారి ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి నీరజ గౌడ్ గారు

కొత్తగా పార్టీలో చేరిన ఆర్. శ్రీదేవి, ఏ. నళినిలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వట్టె జానయ్య గారు మాట్లాడుతూ,

తెలంగాణలో మెజారిటీ వర్గాలకు రాజ్యాధికారంలో వాటా దక్కేవరకు టీఆర్పీ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేవలం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉన్న అధికారాన్ని సామాన్య ప్రజలకు అందించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలకు ఆకర్షితులై యువకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీలోకి చేరడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు మంజుల గౌడ్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, కార్యదర్శి మల్లేష్ యాదవ్,పెన్పహాడ్ అధ్యక్షుడు ఆవుల అంజయ్య, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కోల కరుణాకర్త దితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News