Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:52 PM

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
January 09, 2026 08:22 PM 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

టీఆర్పీ పార్టీలోకి కొత్త నాయకుల చేరిక

పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై నాయకుల జాయినింగ్

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్

శ్రీ వట్టె జానయ్య గారి ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి నీరజ గౌడ్ గారు

కొత్తగా పార్టీలో చేరిన ఆర్. శ్రీదేవి, ఏ. నళినిలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వట్టె జానయ్య గారు మాట్లాడుతూ,

తెలంగాణలో మెజారిటీ వర్గాలకు రాజ్యాధికారంలో వాటా దక్కేవరకు టీఆర్పీ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేవలం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉన్న అధికారాన్ని సామాన్య ప్రజలకు అందించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలకు ఆకర్షితులై యువకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీలోకి చేరడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు మంజుల గౌడ్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, కార్యదర్శి మల్లేష్ యాదవ్,పెన్పహాడ్ అధ్యక్షుడు ఆవుల అంజయ్య, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కోల కరుణాకర్త దితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News