Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:16 AM

తెలంగాణ రాజ్యాధికార పార్టీకి “కత్తెర” గుర్తు – ప్రజల ఆశలకి ప్రతీక

తెలంగాణ రాజ్యాధికార పార్టీకి “కత్తెర” గుర్తు – ప్రజల ఆశలకి ప్రతీక

తెలంగాణ రాజ్యాధికార పార్టీకి “కత్తెర” గుర్తు – ప్రజల ఆశలకి ప్రతీక
January 14, 2026 03:47 PM 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బోగి–సంక్రాంతి–కనుమ శుభాకాంక్షలు తెలిపిన వట్టే జానయ్య యాదవ్

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీకి భారత ఎన్నికల కమిషన్ అధికారికంగా “కత్తెర” ఎన్నికల గుర్తును కేటాయించడం పార్టీ చరిత్రలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ గారు అన్నారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు, ఉద్యమ నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రోజురోజుకు బలోపేతమవుతూ ప్రజల్లో విశ్వాసాన్ని సంపాదించుకుంటోందని పేర్కొన్నారు.“కత్తెర గుర్తు ప్రజల జీవితాల్లోని అన్యాయాలను కత్తిరించి, సమానత్వం, న్యాయాన్ని నెలకొల్పే శక్తివంతమైన ప్రతీకగా నిలుస్తుంది” అని వట్టే జానయ్య యాదవ్ స్పష్టం చేశారు. పేదలు, బీసీలు, దళితులు, ఆదివాసీలు, కూలీలు, రైతుల హక్కుల పరిరక్షణే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు.అదేవిధంగా సంక్రాంతి పండుగల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. రైతుల పండుగైన సంక్రాంతి ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని ఆకాంక్షించారు.

తెలంగాణలో నిజమైన ప్రజాపాలన తీసుకురావడమే లక్ష్యంగా, రాబోయే ఎన్నికల్లో కత్తెర గుర్తుతో ప్రజల ముందుకు వెళ్లి, ప్రజా సమస్యలపై నిర్భయంగా పోరాడతామని వట్టే జానయ్య యాదవ్ గారు ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News