తేజ విద్యాలయలో భారతీయం
తేజ విద్యాలయలో భారతీయం
Harish HS
వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలను పురస్కరించుకుని కొమరబండ తేజ విద్యాలయ పాఠశాలలో నేడు ఆదివారం సాయంత్రం 5.00 గంటలకు “ భారతీయం “ పేరున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ రమాసోమిరెడ్జి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ మున్సిపల్ ఛైర్మన్ యేర్నేని కుసుమ వెంకటరత్నం గారు, విశ్రాంత IAS లు డా. చక్రపాణి గారు, వాడ్రేవు చినవీరభద్రుడు గారు , పాఠశాల విద్యా సంయుక్త సంచాలకులు మారసాని సోమిరెడ్డి గారు , ప్రముఖ గాయకులు చింతల యాదగిరి పాల్గొనడం జరుగుతుంది.
భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో జాతిని ఐక్యం చేసిన వందేమాతరం గేయం ప్రాధాన్యతను తెలియజేస్తూ “వందేమాతరం రచించి 150 ఏళ్లు” పూర్తయిన సందర్భంగా
విద్యార్థులు అన్ని రాష్ట్రాలలోని చరిత్ర, సంస్కృతి, వారసత్వ అంశాలను వివరిస్తూ నృత్య కళలను ప్రదర్శించడం జరుగుతుంది.
అందరికీ ఆహ్వనం తెలియజేస్తున్నామని డైరెక్టర్ సోమిరెడ్డి తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి