తాటి రామచంద్రం జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభం
తాటి రామచంద్రం జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభం
K.RAVI
బస్టాండ్ ఆవరణలో ప్రజలకు చల్లని నీరు – మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో స్వర్గీయ తాటి రామచంద్రం జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. రాజీవ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, తాటి రామచంద్రం సేవా సమితి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ చేతుల మీదగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కీర్తిశేషులు తాటి రామచంద్రం కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. ఆయన స్మారకార్థంగా సేవా సమితి చైర్మన్ తాటి వెంకటేశం ప్రతీ సంవత్సరం వేసవికాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహాన్ని తీర్చడం అభినందనీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, కౌన్సిలర్లు పిల్లలమర్రి మధుసూదన్, పాక చిరంజీవి, మత్స్యకార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పాశం సంజయ్ బాబు, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అధ్యక్షుడు బొబ్బిళ్ళ మురళి, సేవా సమితి చైర్మన్ తాటి వెంకటేశం, ప్రధాన కార్యదర్శి చెరుకు లింగస్వామి, కాంగ్రెస్ నాయకులు గోశిక రవి, గుర్రం వెంకటేశం, గోశిక ప్రభాకర్, బొబ్బిళ్ళ రాజేందర్, రఫీ, బొంగు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి