Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:21 AM

తాటి రామచంద్రం జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభం

తాటి రామచంద్రం జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభం

తాటి రామచంద్రం జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభం
March 22, 2026 04:42 PM 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బస్టాండ్ ఆవరణలో ప్రజలకు చల్లని నీరు – మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో స్వర్గీయ తాటి రామచంద్రం జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. రాజీవ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, తాటి రామచంద్రం సేవా సమితి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ చేతుల మీదగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కీర్తిశేషులు తాటి రామచంద్రం కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. ఆయన స్మారకార్థంగా సేవా సమితి చైర్మన్ తాటి వెంకటేశం ప్రతీ సంవత్సరం వేసవికాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహాన్ని తీర్చడం అభినందనీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, కౌన్సిలర్లు పిల్లలమర్రి మధుసూదన్, పాక చిరంజీవి, మత్స్యకార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పాశం సంజయ్ బాబు, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అధ్యక్షుడు బొబ్బిళ్ళ మురళి, సేవా సమితి చైర్మన్ తాటి వెంకటేశం, ప్రధాన కార్యదర్శి చెరుకు లింగస్వామి, కాంగ్రెస్ నాయకులు గోశిక రవి, గుర్రం వెంకటేశం, గోశిక ప్రభాకర్, బొబ్బిళ్ళ రాజేందర్, రఫీ, బొంగు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News