భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన గీత కార్మికుడు తాటి చెట్టు నుంచి పడి గాయపడ్డాడు. భీమగాని వెంకటేశం గౌడ్ (48) కల్లు తీసే సమయంలో మోకుజారి కిందపడినట్లు సమాచారం.
గాయపడిన వెంకటేశాన్ని స్థానికులు వెంటనే రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై స్పందించిన యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ కార్యదర్శి భావనలపల్లి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యుడు కునూరు మల్లేశం మాట్లాడుతూ బాధితుడికి ప్రభుత్వం తక్షణమే ఎక్స్గ్రేషియా మంజూరు చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి