త్రినిటీ విద్యాసంస్థల్లో అగ్నిమాపక అవగాహన సదస్సు
త్రినిటీ విద్యాసంస్థల్లో అగ్నిమాపక అవగాహన సదస్సు
K.RAVI
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 90 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఫైర్ అండ్ డిజాస్టర్ శాఖ ఆధ్వర్యంలో త్రినిటీ విద్యాసంస్థల్లో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా 8వ తరగతి విద్యార్థి, విద్యార్థినులకు వంటగ్యాస్ వలన సంభవించే ప్రమాదాలు, వాటి నివారణ చర్యలను ప్రత్యక్షంగా చూపిస్తూ అవగాహన కల్పించారు.ఫైర్ ఎక్విప్మెంట్ను ఎలా ఉపయోగించాలి, అగ్ని ఎలా మండుతుంది అనే విషయాలను అధికారులు వివరించారు.చెక్క, పుస్తకాలు, ప్లాస్టిక్ వంటి వస్తువులు, అలాగే ఎల్పిజి గ్యాస్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వంటి ద్రవ పదార్థాలు వేడి, ఆక్సిజన్ కలిసినప్పుడే అగ్ని వ్యాపిస్తుందని తెలిపారు.అగ్ని నియంత్రణకు ఆక్సిజన్ అందకుండా చేయడానికి ఫోమ్, కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించాల్సి ఉంటుందని, వేడిని తగ్గించడానికి నీరు లేదా ఐస్ వాడితే అగ్ని ఆర్పవచ్చని ప్రదర్శన ద్వారా వివరించారు.
అలాగే ఏదైనా విపత్తు సంభవించినప్పుడు వెంటనే 101 ఫైర్ సర్వీస్,100 పోలీస్, 108 అంబులెన్స్కు కాల్ చేయాలని సూచించారు.ఈ సందర్భంగా విపత్తు నివారణ బృందం లీడింగ్ ఫైర్ ఫైటర్ ఆర్. అనిల్ కుమార్, టెక్నికల్ ఫైటర్ కె. శేఖర్, ఫైర్ ఫైటర్లు టి. ప్రసాద్, వి. పాండు, వి. భాగ్య నాయకులు విద్యార్థులకు సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో త్రినిటీ విద్యాసంస్థల డైరెక్టర్, ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జీని మంజుల, చైర్మన్ కెవిబి కృష్ణారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి