Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:57 PM

త్రినిటీ విద్యాసంస్థల్లో అగ్నిమాపక అవగాహన సదస్సు

త్రినిటీ విద్యాసంస్థల్లో అగ్నిమాపక అవగాహన సదస్సు

త్రినిటీ విద్యాసంస్థల్లో అగ్నిమాపక అవగాహన సదస్సు
March 13, 2026 04:27 PM 166 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 90 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఫైర్ అండ్ డిజాస్టర్ శాఖ ఆధ్వర్యంలో త్రినిటీ విద్యాసంస్థల్లో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా 8వ తరగతి విద్యార్థి, విద్యార్థినులకు వంటగ్యాస్ వలన సంభవించే ప్రమాదాలు, వాటి నివారణ చర్యలను ప్రత్యక్షంగా చూపిస్తూ అవగాహన కల్పించారు.ఫైర్ ఎక్విప్మెంట్‌ను ఎలా ఉపయోగించాలి, అగ్ని ఎలా మండుతుంది అనే విషయాలను అధికారులు వివరించారు.చెక్క, పుస్తకాలు, ప్లాస్టిక్ వంటి వస్తువులు, అలాగే ఎల్పిజి గ్యాస్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వంటి ద్రవ పదార్థాలు వేడి, ఆక్సిజన్ కలిసినప్పుడే అగ్ని వ్యాపిస్తుందని తెలిపారు.అగ్ని నియంత్రణకు ఆక్సిజన్ అందకుండా చేయడానికి ఫోమ్, కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించాల్సి ఉంటుందని, వేడిని తగ్గించడానికి నీరు లేదా ఐస్ వాడితే అగ్ని ఆర్పవచ్చని ప్రదర్శన ద్వారా వివరించారు.

అలాగే ఏదైనా విపత్తు సంభవించినప్పుడు వెంటనే 101 ఫైర్ సర్వీస్,100 పోలీస్, 108 అంబులెన్స్‌కు కాల్ చేయాలని సూచించారు.ఈ సందర్భంగా విపత్తు నివారణ బృందం లీడింగ్ ఫైర్ ఫైటర్ ఆర్. అనిల్ కుమార్, టెక్నికల్ ఫైటర్ కె. శేఖర్, ఫైర్ ఫైటర్లు టి. ప్రసాద్, వి. పాండు, వి. భాగ్య నాయకులు విద్యార్థులకు సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో త్రినిటీ విద్యాసంస్థల డైరెక్టర్, ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జీని మంజుల, చైర్మన్ కెవిబి కృష్ణారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News