పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యం-స్టీల్ బాటిళ్లు,టిఫిన్ బాక్సుల ఉచిత పంపిణీ
కౌన్సిలర్ అభ్యర్థి బర్రె సంఘవి-కరుణాకర్
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్
భువనగిరి మున్సిపల్ పరిధిలోని తారకరామనగర్ 32వ వార్డులో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 32వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బర్రె సంఘవి కరుణాకర్ సోమవారం స్థానిక అంగన్వాడీ కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.ఆరోగ్య పరిరక్షణలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలోని విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లు,స్టీల్ టిఫిన్ బాక్సులు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బర్రె సంఘవి కరుణాకర్ మాట్లాడుతూ,తారకరామనగర్లో అంగన్వాడీ కేంద్రానికి తగిన స్థలం కేటాయించి,నూతన అంగన్వాడీ భవనాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు.పిల్లల భవిష్యత్తే తన ప్రథమ లక్ష్యమని,వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు యువకులు,స్థానికులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి