తారకరామ నగర్ 32వ వార్డులో గడపగడపకు ఇండిపెండెంట్ అభ్యర్థి సంఘవి కరుణాకర్ ప్రచారం
తారకరామ నగర్ 32వ వార్డులో గడపగడపకు ఇండిపెండెంట్ అభ్యర్థి సంఘవి కరుణాకర్ ప్రచారం
Sthanikam District Staff Reporter
తారకరామ నగర్ 32వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రె సంఘవి కరుణాకర్ ఇంటింటి గడపగడప ప్రచారంలో భాగంగా వార్డు ప్రజలను నేరుగా కలుస్తూ తమ సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. ఒక్క అవకాశం ఇస్తే వార్డు అభివృద్ధి కోసం,ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాను. ప్రజాసంక్షేమమే నా లక్ష్యం” అని అన్నారు.32వ వార్డులోని మౌలిక వసతుల సమస్యలు, పారిశుద్ధ్యం,తాగునీరు,డ్రైనేజీలు,వీధి దీపాలు వంటి అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి సమస్యను ప్రాధాన్యతతో పరిష్కరించేలా పనిచేస్తానని సంఘవి కరుణాకర్ హామీ ఇచ్చారు. మీ అమూల్యమైన ఓటును సిలిండర్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ఈ గడపగడప ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, వార్డు అభివృద్ధికి అందరి సహకారం అవసరమని ఆయన కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి