Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:11 AM

తప్పుడు వివరాలతో అక్రిడేషన్‌కు దరఖాస్తు చేస్తే కఠిన చర్యలు. చీటింగ్ కేసులు నమోదు చేసే అవకాశం

తప్పుడు వివరాలతో అక్రిడేషన్‌కు దరఖాస్తు చేస్తే కఠిన చర్యలు. చీటింగ్ కేసులు నమోదు చేసే అవకాశం

తప్పుడు వివరాలతో అక్రిడేషన్‌కు దరఖాస్తు చేస్తే కఠిన చర్యలు. చీటింగ్ కేసులు నమోదు చేసే అవకాశం
May 19, 2026 03:52 PM 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలో 2026–28 సంవత్సరాలకు సంబంధించిన మీడియా అక్రిడేషన్ కార్డుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు ఇతర సంస్థలు, ప్రభుత్వ శాఖలు, ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తూ జర్నలిస్టులుగా దరఖాస్తు చేసినట్లు జిల్లా పౌర సంబంధాల కార్యాలయం వెల్లడించింది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతిరోజూ క్రియాశీలకంగా మీడియా రంగంలో పనిచేసే జర్నలిస్టులకే అక్రిడేషన్ కార్డులు జారీ చేస్తారని స్పష్టం చేసింది. ఇతర ఉద్యోగాలు చేస్తూ తప్పుడు వివరాలతో దరఖాస్తు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది.

ఇలాంటి వారిపై చీటింగ్ కేసులు నమోదు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే వారు పనిచేస్తున్న ప్రభుత్వ లేదా ఇతర సంస్థల్లో సస్పెన్షన్ వంటి చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చని తెలిపింది.

అక్రిడేషన్ కోసం తప్పుడు వివరాలతో దరఖాస్తు చేసిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో తమ దరఖాస్తులను వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించింది. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చట్టపరమైన చర్యలు చేపడతామని పీఆర్‌వో కార్యాలయం హెచ్చరించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News