Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:09 AM

తోర్నల్ గ్రామంలో మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం

తోర్నల్ గ్రామంలో మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం

తోర్నల్ గ్రామంలో మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం
December 31, 2025 05:55 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలోని తోర్నల్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్ చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలోని పేద మరియు మధ్యతరగతి మహిళలపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు, వారి గౌరవం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి మహిళకు చీరలు అందేలా గ్రామస్థాయిలో ఈ పథకం సమర్థవంతంగా అమలు చేస్తామని అన్నారు.

మహిళలు కుటుంబానికే కాదు, సమాజ నిర్మాణానికి కూడా పునాదులని పేర్కొన్న ఆయన, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా నేరుగా ప్రజలకు చేరుతున్నాయంటే అది ప్రజా ప్రభుత్వ పాలనకు నిదర్శనమని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళల జీవితాల్లో సంక్షేమ పథకాలు సానుకూల మార్పులు తీసుకొస్తున్నాయని పేర్కొన్నారు.

గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, అందుకే మహిళల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకొని పథకాలు రూపొందిస్తున్నామని తెలిపారు. రాజకీయ భేదాలను పక్కనపెట్టి గ్రామస్థాయిలో సంక్షేమ కార్యక్రమాల అమలుకు అందరూ కలిసి పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్,వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామ మహిళలు పాల్గొన్నారు. చీరలు అందుకున్న మహిళలు ప్రభుత్వానికి మరియు నూతన సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News