Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:43 PM

తమ్మిలేరు పై వంతెన కోసం సిపిఐ ఎమ్ఏ లిబరేషన్ ధర్నా

తమ్మిలేరు పై వంతెన కోసం సిపిఐ ఎమ్ఏ లిబరేషన్ ధర్నా

తమ్మిలేరు పై వంతెన కోసం సిపిఐ ఎమ్ఏ లిబరేషన్ ధర్నా
February 22, 2026 07:13 PM 137 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

గుళ్ళపూడి–కొణిజర్ల గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణం చేయాలని డిమాండ్

సీపీఐ ఎమ్ఏ లిబరేషన్ అనుబంధ అఖిలభారత కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ముసునూరు మండలం గుళ్ళపూడి గ్రామం మరియు లింగపాలెం మండలం కొణిజర్ల గ్రామాల మధ్య ప్రవహిస్తున్న తంబిలేరు పై వంతెన నిర్మించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. మండల అధ్యక్షుడు పామర్తి రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వేముల బక్కయ్య మాట్లాడుతూ గ్రామస్తుల సమస్యలను వివరించారు.

గుళ్ళపూడి గ్రామస్తులకు కొణిజర్ల పరిధిలో దాదాపు వెయ్యి ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయని, పంట కోత సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వరదల సమయంలో తంబిలేరు ఉప్పొంగి పొలాలు ముంపుకు గురవుతుండటంతో పాటు పంట నష్టం వాటిల్లుతోందన్నారు. ధర్మాజీగూడెం మీదుగా కొణిజర్ల చేరుకోవాలంటే సుమారు 14 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తోందని, పర్లాంగు దూరంలో ఉన్న పొలాలకు చేరుకోవాలన్నా అదే దూరం తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రోజువారీ కూలీలు, పశువులు, మేకలు, గొర్రెలు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఘటనలు జరుగుతున్నాయని, కాపరులు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఏరు దాటాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సిన దుర్భర పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

భూములు లింగపాలెం మండలానికి చెందినవని, ప్రభుత్వ కార్యాలయాలు, చింతలపూడి భూమి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాలన్నా, ఆసుపత్రులు, కాలేజీలకు రాకపోకలు సాగించాలన్నా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నూజివీడు, విజయవాడ, అమరావతి వెళ్లేందుకు ఈ మార్గం అత్యంత సమీపమని, సమయం–ఖర్చు ఆదా అవుతుందని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

అందువల్ల గుళ్ళపూడి–కొణిజర్ల గ్రామాల మధ్య తక్షణం వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి, అంచనాలు రూపొందించి, మంత్రి పార్థసారధి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మార్చి 2న ఏలూరు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా లోపూడి–వలసపల్లి క్రాస్ రోడ్డు వరకు ఆర్ & బి రోడ్డుపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పల్లె పాము భవాని, పామర్తి రాజేశ్వరి, పామర్తి సత్యనారాయణ, చిట్టిమాద సీతారామయ్య, గోళ్ళ కొండయ్య తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News