Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:42 PM

తమ ఖర్చులతో పాఠశాలకు రంగుల హరివిల్లు

తమ ఖర్చులతో పాఠశాలకు రంగుల హరివిల్లు

తమ ఖర్చులతో పాఠశాలకు రంగుల హరివిల్లు
February 17, 2026 06:24 PM 419 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఏకమై ముందడుగు వేసిన తాళ్లఖమ్మంపహడ్ యువత

హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

సూర్యాపేట రూరల్ మండలం: జన్మనిచ్చిన తల్లి, అక్షర జ్ఞానం అందించిన బడి, ప్రయోజకుడిగా మార్చిన గ్రామం ప్రతి ఒక్కరి జీవితంలో చెరగని గుర్తులుగా నిలుస్తాయి. ఈ భావనతోనే సూర్యాపేట రూరల్ మండల పరిధిలోని తాళ్లఖమ్మంపహడ్ గ్రామ యువత ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.గ్రామంలోని దేవిరెడ్డి రాంరెడ్డి మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సుమారు రెండు లక్షల రూపాయల వ్యయంతో పెయింటింగ్ చేయించి పాఠశాల భవనానికి కొత్త కళను తెచ్చారు. గ్రామానికి చెందిన ఇరవై మంది యువకులు తమ స్వంత ఖర్చులతో తలా కొంత మొత్తం సమకూర్చి తరగతి గదులు, పాఠశాల గోడలకు అందమైన రంగులు వేయించారు.

తరగతి గదుల గోడలపై విద్యార్థులకు ఉపయోగపడే విద్యా సంబంధిత బొమ్మలు, చిత్రాలు వేయించి పాఠశాల వాతావరణాన్ని ఆకర్షణీయంగా మార్చారు. ఎన్నో సంవత్సరాలుగా రంగులు వేయకపోవడంతో అద్వానంగా మారిన భవనం ఇప్పుడు నూతన రూపంతో మెరిసిపోతోంది. చేతిలో రూపాయి ఉంటే వ్యసనాలకు లోనవుతున్న నేటి యువతకు భిన్నంగా తాళ్లఖమ్మంపహడ్ యువకులు సమాజ సేవలో ఆదర్శంగా నిలిచారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చిన వారిని గ్రామ ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు. ఇదే ఉత్సాహంతో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు కూడా పెయింటింగ్ చేయించి అందంగా తీర్చిదిద్దేందుకు యువత ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రామ అభివృద్ధికి యువత తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ “శభాష్” అని మెచ్చుకుంటున్నారు.


మీ స్పందన? 5 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News