Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 06:26 PM

తాళం వేసిన ఇళ్లే లక్ష్యం – ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: కంగ్టి సిఐ

తాళం వేసిన ఇళ్లే లక్ష్యం – ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: కంగ్టి సిఐ

తాళం వేసిన ఇళ్లే లక్ష్యం – ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: కంగ్టి సిఐ
January 27, 2026 06:33 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ నియోజకవర్గం, కంగ్టి సర్కిల్ పరిధిలో ఇటీవల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ప్రస్తుతం బంగారం ధరలు గణనీయంగా పెరగడంతో దొంగలు ముఖ్యంగా బంగారం మరియు వెండి వస్తువులపై ఎక్కువగా దృష్టి పెట్టుతున్నారని చెప్పారు. రెండు రోజుల క్రితం పొట్పల్లి తండాలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరిగి బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన చోటు చేసుకుందని తెలిపారు.ఈ నేపథ్యంలో కంగ్టి సర్కిల్ పరిధిలోని ప్రజలు క్రింది విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు:

ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

ముఖ్యంగా మహిళలు బయటకు వెళ్లేటప్పుడు బంగారం తక్కువగా ధరించడం మంచిది.

ఊరికి బయటకు వెళ్లేటప్పుడు నగదు, బంగారం, వెండి వస్తువులను ఇంట్లో ఉంచకుండా మీ వెంట తీసుకెళ్లాలి లేదా బ్యాంకు గది లో, లేక నమ్మకమైన వ్యక్తుల వద్ద భద్రపరచాలి.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో విలువైన వస్తువులు ఉంచవద్దు.

ఇళ్లలో తప్పనిసరిగా భద్రతా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.

ఆలయాలలో కూడా విలువైన వస్తువులు లేకుండా చూసుకోవాలి. అవసరమైతే అక్కడ కూడా భద్రతా కెమెరాలు ఏర్పాటు చేయాలి.

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పోలీసు శాఖకు సహకరించి దొంగతనాలను నివారించడంలో భాగస్వాములు కావాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News