Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:56 PM

తాళం వేసిన ఇళ్లే లక్ష్యం – ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: కంగ్టి సిఐ

తాళం వేసిన ఇళ్లే లక్ష్యం – ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: కంగ్టి సిఐ

తాళం వేసిన ఇళ్లే లక్ష్యం – ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: కంగ్టి సిఐ
January 27, 2026 06:33 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ నియోజకవర్గం, కంగ్టి సర్కిల్ పరిధిలో ఇటీవల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ప్రస్తుతం బంగారం ధరలు గణనీయంగా పెరగడంతో దొంగలు ముఖ్యంగా బంగారం మరియు వెండి వస్తువులపై ఎక్కువగా దృష్టి పెట్టుతున్నారని చెప్పారు. రెండు రోజుల క్రితం పొట్పల్లి తండాలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరిగి బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన చోటు చేసుకుందని తెలిపారు.ఈ నేపథ్యంలో కంగ్టి సర్కిల్ పరిధిలోని ప్రజలు క్రింది విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు:

ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

ముఖ్యంగా మహిళలు బయటకు వెళ్లేటప్పుడు బంగారం తక్కువగా ధరించడం మంచిది.

ఊరికి బయటకు వెళ్లేటప్పుడు నగదు, బంగారం, వెండి వస్తువులను ఇంట్లో ఉంచకుండా మీ వెంట తీసుకెళ్లాలి లేదా బ్యాంకు గది లో, లేక నమ్మకమైన వ్యక్తుల వద్ద భద్రపరచాలి.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో విలువైన వస్తువులు ఉంచవద్దు.

ఇళ్లలో తప్పనిసరిగా భద్రతా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.

ఆలయాలలో కూడా విలువైన వస్తువులు లేకుండా చూసుకోవాలి. అవసరమైతే అక్కడ కూడా భద్రతా కెమెరాలు ఏర్పాటు చేయాలి.

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పోలీసు శాఖకు సహకరించి దొంగతనాలను నివారించడంలో భాగస్వాములు కావాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News