PRINT TIME: February 23, 2026 10:49 PM
తలసిల చంద్రశేఖరరావు మృతి పట్ల సంతాపం – కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు
తలసిల చంద్రశేఖరరావు మృతి పట్ల సంతాపం – కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు
February 23, 2026 09:10 PM
6 Views
స్థానికం ప్రతినిధి :
Chakipalli
Mouli
విజయవాడ: వైఎస్సార్సీపీ నాయకులు, ఎమ్మెల్సీ తలసిల రఘురాం తండ్రి తలసిల చంద్రశేఖరరావు ఇటీవల మృతి చెందిన సందర్భంగా సోమవారం నాయకులు రఘురాం నివాసానికి వెళ్లి పరామర్శించారు.
టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జ్ పేరాడ తిలక్ స్వర్గీయ చంద్రశేఖరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్, ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ చింతాడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
స్వర్గీయ చంద్రశేఖరరావు సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నాయకులు ఆకాంక్షించారు. కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి