Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 09:05 PM

తల్లిదండ్రులు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి:ఖేడ్ ఎస్సై సూచనలు

తల్లిదండ్రులు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి:ఖేడ్ ఎస్సై సూచనలు

తల్లిదండ్రులు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి:ఖేడ్ ఎస్సై సూచనలు
February 23, 2026 07:24 PM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna

నారాయణఖేడ్ ఎస్ ఐ శ్రీశైలం మాట్లాడుతూ, రహదారిలో ప్రయాణించే ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ వాహనం నడపాల్సిన అవసరం ఉన్నదని హితవు అందించారు. అదేవిధంగా, సేఫ్టీ కోసం హెల్మెట్ తప్పక ధరించవలసిన అవసరం, వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా తప్పనిసరి అని పేర్కొన్నారు.సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నారాయణఖేడ్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ, మైనర్ విద్యార్థులు ఎప్పుడూ ద్విచక్ర వాహనాలను నడిపకూడదని ఎస్సై శ్రీశైలం హెచ్చరించారు. చట్టం ప్రకారం మైనర్ నడిపించినట్లయితే, వారు కింద పెడతారు, వారి తల్లిదండ్రులు కూడా బాధ్యతలో ఉంటారని వివరించారు.అంతేకాక, రవాణా సమయంలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే బాధితులను ఆసుపత్రికి చేర్చాల్సిన బాధ్యత మనపై ఉన్నదని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, క్రమపద్ధతిగా రోడ్డు వాడకాన్ని పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై మొగులయ్య,నారాయణఖేడ్ డివిజన్ షి టీం ఇంచార్జీ ఏఎస్ఐ తులసి రాం,పాఠశాల ఉపాధ్యాయులు యాదగిరి రాజశేఖర్, చంద్రశేఖర, ధన్సింగ్ మరియు ఇతరులు పాల్గొన్నారు. అవగాహన సదస్సు ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు రోడ్డు భద్రతపై చైతన్యం పెంచుకున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News