తల్లి, ఇద్దరు పిల్లల ప్రాణాలను కాపాడిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు
తల్లి, ఇద్దరు పిల్లల ప్రాణాలను కాపాడిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు
GADDAM JAGANMOHAN REDDY
కుటుంబ కలహాల కారణంగా ఇంట్లో చనిపోతానని చెప్పి, ఇద్దరు పిల్లలతో కలిసి విజయవాడకు వచ్చిన చిలకలపూడికి చెందిన ఓ మహిళను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడారు.చిలకలపూడి పోలీసులు విజయవాడ కంట్రోల్ రూం ఇన్స్పెక్టర్ కి సదరు ఘటనపై సమాచారం ఇవ్వగా వెంటనే అప్రమత్తమైన కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ సంబంధిత స్టేషన్లకు సమాచారం అందించి అప్రమత్తం చేశారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే ప్రకాశం బ్యారేజ్ సమీపంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఆర్.ఎస్.ఐ. శ్రీధర్ కుమార్ మరియు హెడ్ కానిస్టేబుల్ 1520 భూషణం ప్రకాశం బ్యారేజ్ పై నుండి దూకడానికి ప్రయత్నిస్తున్న ఆ మహిళను ఆమె ఇద్దరు పిల్లలను రక్షించి ప్రాణాలను కాపాడారు. అనంతరం వారిని తదుపరి చర్యల నిమిత్తం వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఈ సందర్భంగా, తక్షణ స్పందనతో తల్లి మరియు పిల్లల ప్రాణాలను కాపాడిన పోలీసు సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు అభినందించారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి