Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:07 AM

తాజ్ పూర్ గ్రామంలో యాక్టివ్ కేస్ ఫైండింగ్స్ - ఏసీఎఫ్ (ACF) ప్రత్యేక హెల్త్ క్యాంప్

తాజ్ పూర్ గ్రామంలో యాక్టివ్ కేస్ ఫైండింగ్స్ - ఏసీఎఫ్ (ACF) ప్రత్యేక హెల్త్ క్యాంప్

తాజ్ పూర్ గ్రామంలో యాక్టివ్ కేస్ ఫైండింగ్స్ - ఏసీఎఫ్ (ACF) ప్రత్యేక హెల్త్ క్యాంప్
February 19, 2026 08:16 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా చేపడుతున్న యాక్టివ్ కేస్ ఫైండింగ్స్ (ACF) కార్యక్రమం కింద ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇటీవల డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ గారు తమ సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ లో ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా నోడల్ అధికారి DTCO డాక్టర్ వంశీకృష్ణ హాజరై గ్రామ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. క్యాంప్‌లో భాగంగా గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్యంగా క్షయ, జ్వరాలు,రక్తపోటు, షుగర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించడమే ఈ ఏసీఎఫ్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వైద్యులు తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ...గ్రామంలో ఆరోగ్య శిబిరం నిర్వహించిన వైద్య బృందానికి మరియు సహకరించిన గ్రామ పంచాయతీ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం ప్రతి నెల లేదా రెండు నెలలకొకసారి ఇటువంటి హెల్త్ క్యాంపులు నిరంతరం నిర్వహించాలని సూచించారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందిని కోరారు.అలాగే ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే గర్భిణీ స్త్రీలకు సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రభుత్వ వైద్య సిబ్బంది. ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.గ్రామ స్థాయిలో ముందస్తు పరీక్షలు పెంచితే అనేక రోగాలను ప్రారంభ దశలోనే నియంత్రించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు సభ్యులు, ప్రభుత్వ వైద్య బృందం, ఆరోగ్య కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News