Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:53 PM

తాజ్ పూర్ గ్రామంలో యాక్టివ్ కేస్ ఫైండింగ్స్ - ఏసీఎఫ్ (ACF) ప్రత్యేక హెల్త్ క్యాంప్

తాజ్ పూర్ గ్రామంలో యాక్టివ్ కేస్ ఫైండింగ్స్ - ఏసీఎఫ్ (ACF) ప్రత్యేక హెల్త్ క్యాంప్

తాజ్ పూర్ గ్రామంలో యాక్టివ్ కేస్ ఫైండింగ్స్ - ఏసీఎఫ్ (ACF) ప్రత్యేక హెల్త్ క్యాంప్
February 19, 2026 08:16 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా చేపడుతున్న యాక్టివ్ కేస్ ఫైండింగ్స్ (ACF) కార్యక్రమం కింద ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇటీవల డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ గారు తమ సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ లో ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా నోడల్ అధికారి DTCO డాక్టర్ వంశీకృష్ణ హాజరై గ్రామ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. క్యాంప్‌లో భాగంగా గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్యంగా క్షయ, జ్వరాలు,రక్తపోటు, షుగర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించడమే ఈ ఏసీఎఫ్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వైద్యులు తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ...గ్రామంలో ఆరోగ్య శిబిరం నిర్వహించిన వైద్య బృందానికి మరియు సహకరించిన గ్రామ పంచాయతీ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం ప్రతి నెల లేదా రెండు నెలలకొకసారి ఇటువంటి హెల్త్ క్యాంపులు నిరంతరం నిర్వహించాలని సూచించారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందిని కోరారు.అలాగే ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే గర్భిణీ స్త్రీలకు సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రభుత్వ వైద్య సిబ్బంది. ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.గ్రామ స్థాయిలో ముందస్తు పరీక్షలు పెంచితే అనేక రోగాలను ప్రారంభ దశలోనే నియంత్రించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు సభ్యులు, ప్రభుత్వ వైద్య బృందం, ఆరోగ్య కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News