Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:42 PM

తాగునీటి కొరతకు ముందస్తు బందోబస్తు

తాగునీటి కొరతకు ముందస్తు బందోబస్తు

తాగునీటి కొరతకు ముందస్తు బందోబస్తు
February 18, 2026 11:30 AM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్‌లో మినీ వాటర్ ట్యాంకుల పరిశీలన

న్యాల్కల్ వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామపంచాయతీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మల్గి మెకానిక్ కిష్టన్నలతో కలిసి గ్రామంలోని మినీ వాటర్ ట్యాంకులను మంగళవారం పరిశీలించారు. ట్యాంకుల పనితీరును తనిఖీ చేసి అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని సూచించారు. ట్యాంక్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. లీకేజీలను నివారించి నీటి వృథాను అరికట్టాలని తెలిపారు. వేసవిలో గ్రామానికి తాగునీటిని సమృద్ధిగా అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ చెప్పారు. నీటిని వృథా చేయకుండా వినియోగించాలని గ్రామస్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News