PRINT TIME: April 11, 2026 12:29 AM
తెలంగాణ అసెంబ్లీ ముందు మాజీ సర్పంచ్ల ఆందోళన
తెలంగాణ అసెంబ్లీ ముందు మాజీ సర్పంచ్ల ఆందోళన
December 29, 2025 01:13 PM
23 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
పెండింగ్ బిల్లుల విడుదల కోరుతూ
స్థానికం ప్రతినిధి బిక్షం
పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మాజీ సర్పంచ్లు అసెంబ్లీ ముందు ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన పనులకు ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నంమాజీ సర్పంచ్ల అరెస్ట్
ఆందోళన ఉద్ధృతంగా మారడంతో అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించిన మాజీ సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రూ.531 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించని ప్రభుత్వం
మాజీ సర్పంచ్లకు సంబంధించి సుమారు రూ.531 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వం మారినప్పటికీ ఇప్పటివరకు బిల్లులు విడుదల కాలేదని ఆరోపించారు. బిల్లులు చెల్లించేవరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి