Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:04 PM

తాడిపత్రి – కడప హైవేపై నెయ్యి లారీ బోల్తా… నెయ్యి కోసం జనాల పరుగులు

తాడిపత్రి – కడప హైవేపై నెయ్యి లారీ బోల్తా… నెయ్యి కోసం జనాల పరుగులు

తాడిపత్రి – కడప హైవేపై నెయ్యి లారీ బోల్తా… నెయ్యి కోసం జనాల పరుగులు
March 09, 2026 06:22 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అనంతపురం జిల్లా తాడిపత్రి–కడప జాతీయ రహదారిపై నెయ్యి లోడ్‌తో వెళ్తున్న ఒక లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీకి తీవ్ర నష్టం వాటిల్లగా, లారీ లో ఉన్న నెయ్యి డబ్బాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.

ప్రమాదం విషయం తెలిసిన సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాటిళ్లు, బకెట్లు, క్యాన్లతో వచ్చి రోడ్డుపై పడిన నెయ్యిని నింపుకుని వెళ్లిపోయారు. కొందరు వాహనాల్లో కూడా నెయ్యి తీసుకెళ్లినట్లు సమాచారం.

లారీ బోల్తా పడటంతో కొంతసేపు హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News