అనంతపురం జిల్లా తాడిపత్రి–కడప జాతీయ రహదారిపై నెయ్యి లోడ్తో వెళ్తున్న ఒక లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీకి తీవ్ర నష్టం వాటిల్లగా, లారీ లో ఉన్న నెయ్యి డబ్బాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.
ప్రమాదం విషయం తెలిసిన సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాటిళ్లు, బకెట్లు, క్యాన్లతో వచ్చి రోడ్డుపై పడిన నెయ్యిని నింపుకుని వెళ్లిపోయారు. కొందరు వాహనాల్లో కూడా నెయ్యి తీసుకెళ్లినట్లు సమాచారం.
లారీ బోల్తా పడటంతో కొంతసేపు హైవేపై ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి