ప్రజల పిలుపుతో తాళ్లబస్తిలో కార్పొరేటర్ పర్యటన
భద్రతకు ముప్పుగా మారిన ఐరన్ పోల్స్… సిమెంట్ పోల్స్ ఏర్పాటు హామీ
స్థానిక ప్రతినిధి
ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ పరిధిలోని తాళ్లబస్తి సోనీ సమీప ప్రాంతాన్ని కార్పొరేటర్ వై. ప్రేమ్కుమార్ స్థానికుల పిలుపు మేరకు పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ప్రాంతంలో నెలకొన్న పలు మౌలిక వసతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ప్రధానంగా రోడ్డు, డ్రైనేజీ సమస్యలు, విద్యుత్ పోల్స్ షిఫ్టింగ్ అవసరం, ఐరన్ పోల్ ఎర్తింగ్ వల్ల ప్రమాదం పొంచి ఉండటంతో సిమెంట్ పోల్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలపై కార్పొరేటర్ వెంటనే స్పందించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ప్రాంత ప్రజల భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని కార్పొరేటర్ స్పష్టం చేశారు. కాలనీలోని పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీవాసులు బాలాజీ, మహంతి, రాఘవ, విజయ్కుమార్, పూర్ణశాస్త్రి, సందీప్, సుబ్బారావు, సత్యనారాయణ, కిషోర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి