Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:36 PM

తాళ్లబస్తిలో సమస్యలపై కార్పొరేటర్ పర్యటన… స్థానికుల వినతులకు తక్షణ స్పందన

తాళ్లబస్తిలో సమస్యలపై కార్పొరేటర్ పర్యటన… స్థానికుల వినతులకు తక్షణ స్పందన

తాళ్లబస్తిలో సమస్యలపై కార్పొరేటర్ పర్యటన… స్థానికుల వినతులకు తక్షణ స్పందన
December 28, 2025 06:25 PM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజల పిలుపుతో తాళ్లబస్తిలో కార్పొరేటర్ పర్యటన

భద్రతకు ముప్పుగా మారిన ఐరన్ పోల్స్… సిమెంట్ పోల్స్ ఏర్పాటు హామీ

స్థానిక ప్రతినిధి

ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ పరిధిలోని తాళ్లబస్తి సోనీ సమీప ప్రాంతాన్ని కార్పొరేటర్ వై. ప్రేమ్‌కుమార్ స్థానికుల పిలుపు మేరకు పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ప్రాంతంలో నెలకొన్న పలు మౌలిక వసతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

ప్రధానంగా రోడ్డు, డ్రైనేజీ సమస్యలు, విద్యుత్ పోల్స్ షిఫ్టింగ్ అవసరం, ఐరన్ పోల్ ఎర్తింగ్ వల్ల ప్రమాదం పొంచి ఉండటంతో సిమెంట్ పోల్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలపై కార్పొరేటర్ వెంటనే స్పందించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ప్రాంత ప్రజల భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని కార్పొరేటర్ స్పష్టం చేశారు. కాలనీలోని పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాలనీవాసులు బాలాజీ, మహంతి, రాఘవ, విజయ్‌కుమార్, పూర్ణశాస్త్రి, సందీప్, సుబ్బారావు, సత్యనారాయణ, కిషోర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News