Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:24 AM

తాళ్లబస్తిలో సమస్యలపై కార్పొరేటర్ పర్యటన… స్థానికుల వినతులకు తక్షణ స్పందన

తాళ్లబస్తిలో సమస్యలపై కార్పొరేటర్ పర్యటన… స్థానికుల వినతులకు తక్షణ స్పందన

తాళ్లబస్తిలో సమస్యలపై కార్పొరేటర్ పర్యటన… స్థానికుల వినతులకు తక్షణ స్పందన
December 28, 2025 06:25 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజల పిలుపుతో తాళ్లబస్తిలో కార్పొరేటర్ పర్యటన

భద్రతకు ముప్పుగా మారిన ఐరన్ పోల్స్… సిమెంట్ పోల్స్ ఏర్పాటు హామీ

స్థానిక ప్రతినిధి

ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ పరిధిలోని తాళ్లబస్తి సోనీ సమీప ప్రాంతాన్ని కార్పొరేటర్ వై. ప్రేమ్‌కుమార్ స్థానికుల పిలుపు మేరకు పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ప్రాంతంలో నెలకొన్న పలు మౌలిక వసతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

ప్రధానంగా రోడ్డు, డ్రైనేజీ సమస్యలు, విద్యుత్ పోల్స్ షిఫ్టింగ్ అవసరం, ఐరన్ పోల్ ఎర్తింగ్ వల్ల ప్రమాదం పొంచి ఉండటంతో సిమెంట్ పోల్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలపై కార్పొరేటర్ వెంటనే స్పందించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ప్రాంత ప్రజల భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని కార్పొరేటర్ స్పష్టం చేశారు. కాలనీలోని పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాలనీవాసులు బాలాజీ, మహంతి, రాఘవ, విజయ్‌కుమార్, పూర్ణశాస్త్రి, సందీప్, సుబ్బారావు, సత్యనారాయణ, కిషోర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News