Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:00 AM

తాళ్లబస్తిలో సమస్యలపై కార్పొరేటర్ పర్యటన… స్థానికుల వినతులకు తక్షణ స్పందన

తాళ్లబస్తిలో సమస్యలపై కార్పొరేటర్ పర్యటన… స్థానికుల వినతులకు తక్షణ స్పందన

తాళ్లబస్తిలో సమస్యలపై కార్పొరేటర్ పర్యటన… స్థానికుల వినతులకు తక్షణ స్పందన
December 28, 2025 06:25 PM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజల పిలుపుతో తాళ్లబస్తిలో కార్పొరేటర్ పర్యటన

భద్రతకు ముప్పుగా మారిన ఐరన్ పోల్స్… సిమెంట్ పోల్స్ ఏర్పాటు హామీ

స్థానిక ప్రతినిధి

ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ పరిధిలోని తాళ్లబస్తి సోనీ సమీప ప్రాంతాన్ని కార్పొరేటర్ వై. ప్రేమ్‌కుమార్ స్థానికుల పిలుపు మేరకు పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ప్రాంతంలో నెలకొన్న పలు మౌలిక వసతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

ప్రధానంగా రోడ్డు, డ్రైనేజీ సమస్యలు, విద్యుత్ పోల్స్ షిఫ్టింగ్ అవసరం, ఐరన్ పోల్ ఎర్తింగ్ వల్ల ప్రమాదం పొంచి ఉండటంతో సిమెంట్ పోల్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలపై కార్పొరేటర్ వెంటనే స్పందించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ప్రాంత ప్రజల భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని కార్పొరేటర్ స్పష్టం చేశారు. కాలనీలోని పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాలనీవాసులు బాలాజీ, మహంతి, రాఘవ, విజయ్‌కుమార్, పూర్ణశాస్త్రి, సందీప్, సుబ్బారావు, సత్యనారాయణ, కిషోర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News