Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:55 AM

టీసీలకు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదు ఎమ్మిగనూరు ఎంఎస్ నగర్ హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్

టీసీలకు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదు ఎమ్మిగనూరు ఎంఎస్ నగర్ హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్

టీసీలకు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదు ఎమ్మిగనూరు ఎంఎస్ నగర్ హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్
02-06-2026 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని/ఎమ్మిగనూరు:

ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంఎస్ నగర్ జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు (హెచ్‌ఎం) పదో తరగతి విద్యార్థులకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు (టీసీలు) ఇవ్వడానికి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆదోని సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా పీఆర్‌ఎస్‌వైఎఫ్ రాష్ట్ర నాయకుడు రఘునాథ్, ఆర్‌పీఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆఫ్రిది మాట్లాడుతూ, టీసీల కోసం వచ్చే విద్యార్థుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.300 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత, నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటుంటే, ప్రభుత్వ పాఠశాలలోనే ఇలాంటి వసూళ్లు జరగడం దురదృష్టకరమన్నారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులపై అదనపు భారం మోపడం అన్యాయమని పేర్కొన్నారు. డబ్బులు చెల్లించేందుకు నిరాకరించిన విద్యార్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విద్యాహక్కు చట్టంలో విద్యార్థుల నుంచి ఇలాంటి వసూళ్లకు ఎక్కడ అవకాశం ఉందో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ అక్రమ వసూళ్లు ఒక్క ఏడాదికే పరిమితం కావని, సంబంధిత హెచ్‌ఎం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇదే తరహా వ్యవహారం కొనసాగుతోందని ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి, నిజానిజాలు వెలికి తీసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Sthanikam

టీసీలకు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదు ఎమ్మిగనూరు ఎంఎస్ నగర్ హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్

Article Image

ఆదోని/ఎమ్మిగనూరు:

ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంఎస్ నగర్ జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు (హెచ్‌ఎం) పదో తరగతి విద్యార్థులకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు (టీసీలు) ఇవ్వడానికి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆదోని సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా పీఆర్‌ఎస్‌వైఎఫ్ రాష్ట్ర నాయకుడు రఘునాథ్, ఆర్‌పీఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆఫ్రిది మాట్లాడుతూ, టీసీల కోసం వచ్చే విద్యార్థుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.300 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత, నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటుంటే, ప్రభుత్వ పాఠశాలలోనే ఇలాంటి వసూళ్లు జరగడం దురదృష్టకరమన్నారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులపై అదనపు భారం మోపడం అన్యాయమని పేర్కొన్నారు. డబ్బులు చెల్లించేందుకు నిరాకరించిన విద్యార్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విద్యాహక్కు చట్టంలో విద్యార్థుల నుంచి ఇలాంటి వసూళ్లకు ఎక్కడ అవకాశం ఉందో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ అక్రమ వసూళ్లు ఒక్క ఏడాదికే పరిమితం కావని, సంబంధిత హెచ్‌ఎం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇదే తరహా వ్యవహారం కొనసాగుతోందని ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి, నిజానిజాలు వెలికి తీసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News