Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:37 AM

టీసీలకు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదు ఎమ్మిగనూరు ఎంఎస్ నగర్ హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్

టీసీలకు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదు ఎమ్మిగనూరు ఎంఎస్ నగర్ హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్

టీసీలకు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదు ఎమ్మిగనూరు ఎంఎస్ నగర్ హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్
June 02, 2026 03:24 AM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని/ఎమ్మిగనూరు:

ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంఎస్ నగర్ జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు (హెచ్‌ఎం) పదో తరగతి విద్యార్థులకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు (టీసీలు) ఇవ్వడానికి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆదోని సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా పీఆర్‌ఎస్‌వైఎఫ్ రాష్ట్ర నాయకుడు రఘునాథ్, ఆర్‌పీఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆఫ్రిది మాట్లాడుతూ, టీసీల కోసం వచ్చే విద్యార్థుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.300 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత, నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటుంటే, ప్రభుత్వ పాఠశాలలోనే ఇలాంటి వసూళ్లు జరగడం దురదృష్టకరమన్నారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులపై అదనపు భారం మోపడం అన్యాయమని పేర్కొన్నారు. డబ్బులు చెల్లించేందుకు నిరాకరించిన విద్యార్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విద్యాహక్కు చట్టంలో విద్యార్థుల నుంచి ఇలాంటి వసూళ్లకు ఎక్కడ అవకాశం ఉందో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ అక్రమ వసూళ్లు ఒక్క ఏడాదికే పరిమితం కావని, సంబంధిత హెచ్‌ఎం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇదే తరహా వ్యవహారం కొనసాగుతోందని ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి, నిజానిజాలు వెలికి తీసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News