టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా గడ్డం యాదగిరి.
టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా గడ్డం యాదగిరి.
Editor Desk
రామన్నపేట మండలం పల్లివాడ గ్రామానికి చెందిన దళిత నాయకుడు గడ్డం యాదగిరి టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామక పత్రాన్ని అందజేశారు. యాదగిరి నియామకంపై దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గడ్డం యాదగిరి మాట్లాడుతూ తనకు బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, 57 ఉపకులాల వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశంకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని, వివిధ దశల్లో ప్రజా సేవలో కొనసాగుతూ వచ్చినట్లు పేర్కొన్నారు.
1996లో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా చేరిన ఆయన గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్లో చేరి గ్రామ శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గంలో పార్టీ విజయానికి కృషి చేసినట్లు తెలిపారు. తర్వాత తెలంగాణ ఉద్యమకారుడిగా టీజేఎస్లో కొనసాగుతూ కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి మద్దతు ఇచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. తన సామాజిక సేవలను గుర్తించి టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. చిందు సామాజిక వర్గానికి చెందిన తనకు ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటానని చెప్పారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి