Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:36 AM

టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా గడ్డం యాదగిరి.

టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా గడ్డం యాదగిరి.

టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా గడ్డం యాదగిరి.
June 02, 2026 07:47 PM 231 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం పల్లివాడ గ్రామానికి చెందిన దళిత నాయకుడు గడ్డం యాదగిరి టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామక పత్రాన్ని అందజేశారు. యాదగిరి నియామకంపై దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గడ్డం యాదగిరి మాట్లాడుతూ తనకు బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, 57 ఉపకులాల వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశంకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని, వివిధ దశల్లో ప్రజా సేవలో కొనసాగుతూ వచ్చినట్లు పేర్కొన్నారు.

1996లో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా చేరిన ఆయన గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్‌లో చేరి గ్రామ శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గంలో పార్టీ విజయానికి కృషి చేసినట్లు తెలిపారు. తర్వాత తెలంగాణ ఉద్యమకారుడిగా టీజేఎస్‌లో కొనసాగుతూ కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి మద్దతు ఇచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. తన సామాజిక సేవలను గుర్తించి టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. చిందు సామాజిక వర్గానికి చెందిన తనకు ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటానని చెప్పారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News