తెలంగాణలో ఇంధన సరఫరా సజావు.పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదన్న ఓఎంసీలు
తెలంగాణలో ఇంధన సరఫరా సజావు.పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదన్న ఓఎంసీలు
Editor Desk
హైదరాబాద్ : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరా సజావుగా కొనసాగుతోందని, ఎక్కడా కొరత లేదని చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) స్పష్టం చేశాయి. సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ రవాణా, పంపిణీ సేవలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపాయి.
ఈ నెల తొలి 15 రోజుల్లో పెట్రోల్ సరఫరాలో 14.2 శాతం, డీజిల్ సరఫరాలో 15.7 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించాయి. వేసవి ప్రభావంతో గృహావసర ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్స్ కొంత తగ్గాయని, ఇది సాధారణ పరిస్థితేనని పేర్కొన్నాయి.
ఈ నెలలో నిన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 20.06 లక్షల గృహావసర ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేసినట్లు తెలిపాయి. ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్, ఐవీఆర్ఎస్, ఆన్లైన్ వేదికల ద్వారా సిలిండర్లు బుక్ చేసుకోవాలని వినియోగదారులను సూచించాయి.
ఎల్పీజీ సిలిండర్ల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ఓటీపీ ఆధారిత డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ) విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో డీఏసీ అమలు 95 శాతానికి పైగా ఉందని, దానిని వంద శాతానికి చేర్చేందుకు వినియోగదారుల సహకారం అవసరమని తెలిపాయి.
నకిలీ వార్తలు, వదంతులను నమ్మవద్దని, అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని ఓఎంసీలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి