Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:37 PM

తెలంగాణలో ఇంధన సరఫరా సజావు.పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ కొరత లేదన్న ఓఎంసీలు

తెలంగాణలో ఇంధన సరఫరా సజావు.పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ కొరత లేదన్న ఓఎంసీలు

తెలంగాణలో ఇంధన సరఫరా సజావు.పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ కొరత లేదన్న ఓఎంసీలు
May 18, 2026 05:08 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ సరఫరా సజావుగా కొనసాగుతోందని, ఎక్కడా కొరత లేదని చమురు మార్కెటింగ్‌ సంస్థలు (ఓఎంసీలు) స్పష్టం చేశాయి. సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ రవాణా, పంపిణీ సేవలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపాయి.

ఈ నెల తొలి 15 రోజుల్లో పెట్రోల్‌ సరఫరాలో 14.2 శాతం, డీజిల్‌ సరఫరాలో 15.7 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించాయి. వేసవి ప్రభావంతో గృహావసర ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్స్‌ కొంత తగ్గాయని, ఇది సాధారణ పరిస్థితేనని పేర్కొన్నాయి.

ఈ నెలలో నిన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 20.06 లక్షల గృహావసర ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేసినట్లు తెలిపాయి. ఎస్‌ఎంఎస్‌, మిస్డ్‌ కాల్‌, ఐవీఆర్‌ఎస్‌, ఆన్‌లైన్‌ వేదికల ద్వారా సిలిండర్లు బుక్‌ చేసుకోవాలని వినియోగదారులను సూచించాయి.

ఎల్పీజీ సిలిండర్ల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ఓటీపీ ఆధారిత డెలివరీ అథెంటికేషన్ కోడ్‌ (డీఏసీ) విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో డీఏసీ అమలు 95 శాతానికి పైగా ఉందని, దానిని వంద శాతానికి చేర్చేందుకు వినియోగదారుల సహకారం అవసరమని తెలిపాయి.

నకిలీ వార్తలు, వదంతులను నమ్మవద్దని, అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని ఓఎంసీలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News