Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:00 AM

తెలంగాణలో ఇంధన సరఫరా సజావు.పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ కొరత లేదన్న ఓఎంసీలు

తెలంగాణలో ఇంధన సరఫరా సజావు.పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ కొరత లేదన్న ఓఎంసీలు

తెలంగాణలో ఇంధన సరఫరా సజావు.పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ కొరత లేదన్న ఓఎంసీలు
18-05-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ సరఫరా సజావుగా కొనసాగుతోందని, ఎక్కడా కొరత లేదని చమురు మార్కెటింగ్‌ సంస్థలు (ఓఎంసీలు) స్పష్టం చేశాయి. సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ రవాణా, పంపిణీ సేవలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపాయి.

ఈ నెల తొలి 15 రోజుల్లో పెట్రోల్‌ సరఫరాలో 14.2 శాతం, డీజిల్‌ సరఫరాలో 15.7 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించాయి. వేసవి ప్రభావంతో గృహావసర ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్స్‌ కొంత తగ్గాయని, ఇది సాధారణ పరిస్థితేనని పేర్కొన్నాయి.

ఈ నెలలో నిన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 20.06 లక్షల గృహావసర ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేసినట్లు తెలిపాయి. ఎస్‌ఎంఎస్‌, మిస్డ్‌ కాల్‌, ఐవీఆర్‌ఎస్‌, ఆన్‌లైన్‌ వేదికల ద్వారా సిలిండర్లు బుక్‌ చేసుకోవాలని వినియోగదారులను సూచించాయి.

ఎల్పీజీ సిలిండర్ల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ఓటీపీ ఆధారిత డెలివరీ అథెంటికేషన్ కోడ్‌ (డీఏసీ) విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో డీఏసీ అమలు 95 శాతానికి పైగా ఉందని, దానిని వంద శాతానికి చేర్చేందుకు వినియోగదారుల సహకారం అవసరమని తెలిపాయి.

నకిలీ వార్తలు, వదంతులను నమ్మవద్దని, అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని ఓఎంసీలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.

Sthanikam

తెలంగాణలో ఇంధన సరఫరా సజావు.పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ కొరత లేదన్న ఓఎంసీలు

Article Image

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ సరఫరా సజావుగా కొనసాగుతోందని, ఎక్కడా కొరత లేదని చమురు మార్కెటింగ్‌ సంస్థలు (ఓఎంసీలు) స్పష్టం చేశాయి. సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ రవాణా, పంపిణీ సేవలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపాయి.

ఈ నెల తొలి 15 రోజుల్లో పెట్రోల్‌ సరఫరాలో 14.2 శాతం, డీజిల్‌ సరఫరాలో 15.7 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించాయి. వేసవి ప్రభావంతో గృహావసర ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్స్‌ కొంత తగ్గాయని, ఇది సాధారణ పరిస్థితేనని పేర్కొన్నాయి.

ఈ నెలలో నిన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 20.06 లక్షల గృహావసర ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేసినట్లు తెలిపాయి. ఎస్‌ఎంఎస్‌, మిస్డ్‌ కాల్‌, ఐవీఆర్‌ఎస్‌, ఆన్‌లైన్‌ వేదికల ద్వారా సిలిండర్లు బుక్‌ చేసుకోవాలని వినియోగదారులను సూచించాయి.

ఎల్పీజీ సిలిండర్ల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ఓటీపీ ఆధారిత డెలివరీ అథెంటికేషన్ కోడ్‌ (డీఏసీ) విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో డీఏసీ అమలు 95 శాతానికి పైగా ఉందని, దానిని వంద శాతానికి చేర్చేందుకు వినియోగదారుల సహకారం అవసరమని తెలిపాయి.

నకిలీ వార్తలు, వదంతులను నమ్మవద్దని, అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని ఓఎంసీలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News